విశాఖ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం కొద్ది సేపు సాగర తీరంలో సరదాగా గడిపారు. రుషికొండ ప్రాంతాన్ని పరిశీలించారు. దీనికి సంబంధించి ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విశాఖ పర్యటనకు విచ్చేసిన ప్రధాని మోడీని కలిసేందుకు నిన్న పవన్ కళ్యాణ్ నగరానికి విచ్చేసిన సంగతి తెలిసిందే. రాత్రి మోడీతో భేటీ అయిన తర్వాత తను బసచేసిన నోవాటెల్ హోటల్ కు వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ హోటల్ లోనే పలువురు ముఖ్యనేతలతో సమావేశమైయ్యారు. సాయంత్రం పార్టీ నేతలతో కలిసి కాపులప్పాడు బీచ్ ను సందర్శించి కొద్దిసేపు సాగర తీరంలో సరదాగా గడిపారు. అక్కడ స్థానిక మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రుషికొండ ప్రాంతాన్ని పరిశీలించారు.
రుషికొండ తవ్వకాలపై రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే,. అక్కడి తవ్వకాలపై ప్రతిపక్షాల నుండి విమర్శలు చేస్తుండటం, కోర్టులో వ్యాజ్యాలు నడుస్తున్నాయి. ఈ తరుణంలో రుషికొండ ప్రాంతానికి పవన్ కళ్యాణ్ వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంతకు ముందు పలువురు నేతలు రుషికొండ ప్రాంతానికి వెళితే అడ్డుకున్నారు. అయితే కొండపై పనులు జరుగుతున్న ప్రాంతంలో పెద్ద పెద్ద షీట్లతో బారికేడ్లు ఏర్పాటు చేసి ఉండటంతో దాని పక్కన ఉన్న మట్టిదిబ్బ ఎక్కి పవన్ కళ్యాణ్ లోపల జరుగుతున్న పనులు పరిశీలించారు. ఆయన వెంట జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, విశాఖ కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ తదితరులు ఉన్నారు. దీనికి సంబందించిన ఫోటోలు, వీడియోలు జనసేన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో అవి వైరల్ అయ్యాయి.
గత నెల పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనకు వచ్చిన సమయంలో జరిగిన ఘటనల నేపథ్యంలో పోలీసులు ఆయన్ను హోటల్ కే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అటువంటి ఆంక్షలు ఏమీ లేకపోవడంతో పవన్ కళ్యాణ్ అలా బీచ్ కి, రుషి కొండ ప్రాంతానికి వెళ్లి వచ్చారు.
Pawan Kalyan: ప్రధాని మోడీతో భేటీ ఫలప్రదమైందని చెప్పిన పవన్ కళ్యాణ్
రిషికొండ ను మింగేస్తున్న వైసీపీ ప్రభుత్వ తీరును కనులారా వీక్షించిన శ్రీ @PawanKalyan గారు. విశాఖపట్నం పర్యటన లో భాగంగా రుషికొండ ను పరిశీలించడానికి వెళ్లగా, కొండ చుట్టూ బారికేడ్లు పెట్టి లోపల పనులు చేస్తుండటంతో బయట నుంచి కొండపై జరుగుతున్న పనులను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు pic.twitter.com/iKnUQ6YZtA
— JanaSena Party (@JanaSenaParty) November 12, 2022