అమరావతి: అధికారపక్షంపై యుద్ధానికి జనసేన సిద్ధమవుతోంది. టిడిపిని తమ పార్టీని ఒకే గాటన కట్టి కావాలనే వైసిపి దుష్ప్రచారానికి పాల్పడుతోందని జనసేన నాయకత్వం భావిస్తున్నది. వైసిపి సోషల్ మీడియాపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు లీగల్ నోటీసులు ఇవ్వాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని పార్టీ ట్విట్టర్ ఖాతాలో జనసేన పేర్కొన్నది. జనసేన పార్టీపై వైసిపి సోషల్ మీడియా విభాగం అవాస్తవాలను ప్రచారం చేస్తున్నదని జనసేన ఆరోపిస్తున్నది.
‘పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు దాదాపు 2000 కోట్ల రూపాయల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చాలనే ప్లాన్లో అమెరికాలోని తానా వర్గం ఉన్నట్టుగా సమాచారం. అందుకే పవన్ అభిమానుల ముసుగులో విరాళాలు వసూలు చేసి వాటికి చంద్రబాబు ఇచ్చిన బ్లాక్ మనీ కలిపి దానిని వైట్ మనీగా మార్చడానికి పక్కా పథకాన్ని ప్లాన్ చేసినట్టు ఇప్పటికే కొంత మంది పవన్ అభిమానులు గుర్తించి తీవ్ర నిరాశతో ఉన్నారు.’ అని అరోపిస్తూ వైసిపి సోషల్ మీడియా ఫేస్ బుక్ పేజీలో ఈ నెల 20వ తేదీన పోస్టు చేశారు.
ఈ నేపథ్యంలో పార్టీపై ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు చేపట్టేలా ముందుకు వెళ్లాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ వర్గాలకు స్పష్టం చేసినట్లు సమాచారం.
https://www.facebook.com/YsrcpSocialMedia/posts/2392724297663461?__xts__[0]=68.ARB6LZ2Xg3V2eQwBUSepeLoICCjmdgGrgiSHkioJ4DegoRgXOwjIzzIaDmfi_HhEeD_3zUzydMWTgTBI5kVlzGtx3ygYgNFkOgMySwWTOlBwfBGicMGV3e9eN341f_pshjjoIk9n3iSTfg-DA0jTJR1hS73zPuY4OCYt1NLF32hXWwquU2dh1DUCz5gUJiZS_lF6qpuRcE8eICmAf6xPFJVDHugOrHlunCwpkfGWgKwZXI9HB1CCn1FuCnHygLBgb3WxR2ya8ZsmRg-5aD9hsW1ICiOPtZHITS-V3GJURpQvwwpNQv2be6ytiwr-mWYduXp8tgvFk5cpyDbk9PZnKbuI&__tn__=-R
* వైఎస్సార్సీపీ సోషల్ మీడియాపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని, లీగల్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న జనసేన పార్టీ. pic.twitter.com/QKhg0Cc4UB
— JanaSena Party (@JanaSenaParty) August 23, 2019