ఇటీవల ఒంగోలు జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వలన చనిపోవటం సూసైడ్ నోట్ రాయటం అందరికీ తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా భారీ స్థాయిలో కథనాలు వరుసగా ప్రచారం చేస్తూ ఉన్నాయి. మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యకర్త చావుకు కారణమైన ఎమ్మెల్యేని వదిలి పెట్టకూడదని ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది.
అంతేకాకుండా రాబోయే రోజుల్లో అన్నా రాంబాబు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా రాజకీయంగా అణగదొక్కేందుకు అన్నట్టు పవన్ భారీ డైలాగులు వేయడం జరిగింది. ఇలాంటి తరుణంలో అన్నా రాంబాబు జగన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించగా.. జగన్ తిరస్కరించినట్లు ఏపీ రాజకీయాల్లో టాపిక్ నడుస్తుంది.
మేటర్ లోకి వెళ్తే ఈ ఘటనకు సంబంధించి జగన్ నిఘా వర్గాల ద్వారా సమాచారం తేప్పించుకున్నట్లు..ఎమ్మెల్యే వైఖరి వల్లే అతడు మరణించినట్లు.. తేలడంతో, జగన్ ఈ ఘటనపై ఫుల్ సీరియస్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పైగా రాష్ట్రంలో అన్నా రాంబాబు కి భారీ మెజార్టీ రావటంతో .. ఈ ఘటన పార్టీకి పెద్ద మైనస్ గా మారింది. చాలా సందర్భాలలో అభ్యంతరకరంగా అన్నా రాంబాబు వైఖరి ఉండటం.. సామాన్యుల పై సీరియస్ అవ్వటం వంటి విషయాలు జగన్ దృష్టికి వచ్చినట్లు దీంతో తాజా పరిణామాలతో ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు విముఖత చూపించినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ ఘటనపై జగన్ ఫుల్ సీరియస్ గా ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?