అమరావతి, మార్చి 1: రాజకీయాల్లోకి కొత్త తరం రావాలన్న జనసేనాని పవన్ కళ్యాణ్ సంకల్పానికి అన్ని వర్గాల నుండి అనూహ్య స్పందన లభిస్తోందని పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి హరి ప్రసాద్ తెలియజేశారు.
జనసేన తరపున ఎన్నికల బరిలో నిలవడానికి విద్యావంతులు ఉత్సాహం చూపిస్తున్నారని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల నుండి 2087, పార్లమెంట్ నియోజకవర్గాలకు 323మంది బయోడేటాలను సమర్పించారని వరప్రసాద్ చెప్పారు.
ధరఖాస్తులు చేసిన వారిలో 80శాతం మంది 50సంవత్సరాల లోపు వారేనని తెలిపారు.
ధరఖాస్తులు చేసిన వారిలో 945మంది పట్టభద్రులు, 720మంది ఉన్నత పట్టభద్రులు, 30మంది పరిశోధకులు, ఎనిమిది మంది గణిత నిపుణులు, ఇతరులు 707మంది ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
ధరఖాస్తులు చేసిన వారిలో పురుషులు 1839, స్రీలు 570మందితో పాటు ఒక ట్రాన్స్జండర్ ఉన్నారు.