హైదరాబాద్: తెలంగాణలో జరగబోయే పురపాలక ఎన్నికలకు తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలపకూడదని జనసేన నిర్ణయించుకున్నది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా మున్సిపల్ ఎన్నికలలో పార్టీ పరంగా గ్లాస్ గుర్తుతో పోటీ చేయడం లేదని ఆ పార్టీ అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్న పార్టీ కార్యకర్తలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే కార్యకర్తలకు పార్టీ తరపున మద్దతు ఉంటుందని హరిప్రసాద్ నేడొక ప్రకటనలో తెలియజేశారు.
ఇండిపెండెంట్లుగా పోటీ చేయండి. pic.twitter.com/pUAJ8FTnU2
— JanaSena Party (@JanaSenaParty) January 8, 2020