తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలలో మొదట ప్రతిపక్ష పార్టీ టీడీపీ పోటీ చేయకూడదని భావించిన తర్వాత పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం తో బీజేపీ కూడా రంగంలోకి దిగి ఉప ఎన్నికలకు రెడీ అవుతుంది. పరిస్థితి ఇలా ఉండగా ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ… తెలంగాణలో ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన మాదిరిగా ఇక్కడ గెలవటానికి పావులు కదుపుతోంది.
వాస్తవానికి బిజెపికి తిరుపతిలో పెద్దగా బలం లేదు క్యాడర్ కూడా లేదు. ఇటువంటి తరుణంలో మిత్రపక్షంగా ఉన్న జనసేన కూడా పోటీలోకి దిగి ఓట్లు చీల్చే కార్యక్రమం చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పట్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి బాగా క్యాంపెయిన్ చేసిన సంగతి తెలిసిందే. ఆ టైంలో పార్టీకి కీలకంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉండటం జరిగింది.
తిరుపతి లో కాపులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జనసేన పోటీకి దిగుతున్నట్లు.. ఓట్లు చీల్చడానికి రెడీ అవుతున్నట్లు టాక్. దీంతో బీజేపీకి కొంత లాభం వచ్చే అవకాశమున్నట్లు.. వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే గతంలో చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచిన అక్కడ పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టక పోవడంతో పాటు ప్రజారాజ్యం పార్టీని ఎవరికీ తెలియ చెప్పకుండా కాంగ్రెస్ పార్టీలో కలిపేయడం తో.. జనసేన పోటీలో నిలబడిన ఆ పార్టీని కూరలో కరివేపాకు మాదిరిగా తిరుపతి ప్రజలు తీసేస్తారు అనే టాక్ వస్తోంది. ఏది ఏమైనా తిరుపతి ఉప ఎన్నికల్లో ఏపీ బీజేపీ దుబ్బాక సీన్ రిపీట్ చేయాలని పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్.