చైనా దేశం వ్యవహరిస్తున్న తీరు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. ఒకపక్క కరోనా వైరస్ కావాలని ప్రపంచం పైకి వదిలింది అని ప్రపంచ దేశాలు బలంగా నవ్వుతున్నాయి. అలాంటి తరుణంలో తన చుట్టుపక్కల ఉన్న దేశాల సరిహద్దుల విషయంలో గొడవలు పెట్టుకోవడం, ఆక్రమించుకోవడం కోసం చేస్తున్న చైనా దూకుడు వ్యవహారంతో ప్రపంచవ్యాప్తంగా చైనా పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇండియా తో లడక్ సరిహద్దు ప్రాంతం గొడవలు పెట్టుకోగా, తాజాగా ఇప్పుడు జపాన్ తో కూడా గొడవ పెట్టుకోవడానికి రెడీ అయ్యింది. జపాన్ దేశంలో కొన్ని సరిహద్దు భూభాగాలు తమదేనంటూ చైనా ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేయటానికి స్టార్ట్ అయింది.వాస్తవంగా జపాన్ దేశం ఒకరి జోలికి వెళ్లదు తన జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి ఉండదు. అభివృద్ధే లక్ష్యంగా జపాన్ ప్రపంచం అభివృద్ధి దేశాలతో పోటీ పడుతుంది. దీంతో తాజా చైనా దుందుకుడు చర్య వల్ల జపాన్ వార్నింగ్ ఇచ్చింది. చైనా 1972నుంచి తమ దేశానికి చెందింది అని చెప్పుకుంటున్న జపాన్ తీరంలో ఉన్న శంఖకుష్ దీవులకు సంబంధించి ఆక్రమించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల విషయంలో…జపాన్ చైనా కు వార్నింగ్ ఇచ్చింది. తమ భూభాగాల జోలికి వస్తే ఊరుకోబోమని తెలిపింది. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా జపాన్ పరిపాలనలో ఉంది. ఆ ప్రాంతాలలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తోంది జపాన్. ఇటువంటి సమయంలో జపాన్ ఈ విషయంలో చైనా తేడా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అని వార్నింగ్ ఇచ్చిందట. సరిహద్దు భూభాగాల విషయంలో ఎక్స్ట్రాలు చేస్తే భారత్ విషయంలో కూడా ఇన్ వాల్వ్ అవ్వాల్సి వస్తోందని స్ట్రాంగ్ గా జపాన్….చైనా కి వార్నింగ్ ఇచ్చినట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వినపడుతున్నాయి.
ముఖ్యంగా తన భూభాగంలో శంఖకుష్ దీవుల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తే తనతోపాటు యూరోపియన్ యూనియన్ అమెరికా ని కూడా రంగంలోకి దింపాలని బ్రహ్మాస్త్రంగా చైనాపై వదలాలని జపాన్ ఆల్రెడీ స్కెచ్ వేసిందట. దీంతో భారత్ చైనా సరిహద్దు వివాదంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించే ఛాన్స్ లేకపోయినా కానీ, చైనా జపాన్ సరిహద్దు వివాదంలో అమెరికా జోక్యం చేసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు పరిశీలకులు. అమెరికా ఇన్ వాల్వ్ అయితే కచ్చితంగా చైనా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ఎందుకంటే చైనా నుండి విడుదలైన కరోనా వైరస్ ఎక్కువగా అమెరికాలో ఆర్థిక మరియు ప్రాణనష్టం ఎంతగానో జరిగింది. దీంతో వచ్చిన ఈ అవకాశాన్ని కచ్చితంగా అమెరికా ఉపయోగించుకుని…అటు జపాన్ ఇటు భారత్ ని కూడా కలుపుకుని పోతే చైనా దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేసిన ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.
previous post