సిడ్నీ, జనవరి 8: అసీస్తో జరిగిన టెస్టు సీరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి కల్పిస్తున్నట్లు భారత క్రికెట్ కంట్రోలు బోర్డు ప్రకటించింది. జనవరి 12 నుంచి భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. బుమ్రా స్ధానంలో హైదరాబాద్ ప్లేయర్ మహ్మద్ సిరాజ్కు అవకాశం లభించింది. రానున్న సిరీస్లను దృష్టిలో పెట్టుకుని బుమ్రాకు విశ్రాంతి నివ్వడం మంచిదని బిసిసిఐ తెలిపింది.
జనవరి 23 నుంచి న్యూజిలాండ్ టూరు ప్రారంభం అవుతుంది. అక్కడ ఐదు వన్డేలు, మూడు టీ 20లు అడనున్నారు.
previous post