Swapna cinema : మహా శివరాత్రి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ సినిమా జాతి రత్నాలు. మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడగా జాతి రత్నాలు సినిమా సంచలన విజయాన్ని అందుకొని కొత్త రికార్డ్స్ ని సృష్టిస్తోంది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రా రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. జాతి రత్నాలు సినిమా వసూళ్ళ విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ అంతా సంతృప్తిగా ఉన్నారు. ఇలాంటి సినిమాని తీయాలంటే కేవలం ఒక్క స్వప్న సినిమా బ్యానర్ వల్లే సాధ్యం అని మరోసారి ప్రూవ్ అయింది. ఎలాంటి అంచనాలు లేకుండా పెద్ద పెద్ద స్టార్స్ లేకుండా కూడా ఊహించని విజయం అందుకోవడంలో స్వప్న సినిమా నిర్మాతలు తమ సత్తాని మరోసారి చాటుకున్నారు.
ముందు నుంచి కూడా స్వప్న సినిమా నిర్మాతలు చేస్తున్నది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం వాళ్ళతో వినూత్నమైన ప్రయోగాలను చేసి సక్సస్ లు అందుకోవడం. పెద్ద ఫేం ఉన్న నటీ నటులు లేకపోయినా కథ తోనే భారీ హిట్ సాధిస్తున్నారు. ఇండస్ట్రీలో ఇలాంటి ప్రయోగాలు చాలా తక్కువ మంది నిర్మాతలు చేస్తుంటారు. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో నాగ్ అశ్విన్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఎవడే సుబ్రమణ్యం లాంటి సినిమాతో ప్రేక్షకులను మెప్పించాలంటే అంత సులభం కాదు. ఎవరెస్టు శిఖరంపై చిత్రీకరణ జరిపి ఇండస్ట్రీలో కొత్త ఆలోచనలకి పునాది వేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్.
Swapna cinema : జాతి రత్నాలు తో ‘స్వప్న సినిమా’ నిర్మాణ సంస్థ పేరు మార్మోగిపోయింది.
ఆ తర్వాత నాగ్ అశ్విన్ రెండవ సినిమా అలనాటి పాపులర్ హీరోయిన్ సావిత్రి బయోపిక్ ని తెరకెక్కించాలన్న ఆలోచన రావడమే గొప్ప విషయం. అనుకున్న ఆలోచనని అమలు చేసి భారీ సక్సస్ అందుకొని దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు నాగ్ అశ్విన్. ఈ సినిమాతో స్వప్న సినిమా నిర్మాణ సంస్థ పేరు మార్మోగిపోయింది. ఇక ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాతి రత్నాలు సినిమా సక్సస్తో ఈ బ్యానర్ పేరు ప్రతిష్ఠలు మరింత పెరిగాయి. చిన్న సినిమాగా వచ్చి ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగ రాస్తోంది. దర్శకుడిగా సక్సస్ అయిన నాగ్ అశ్విన్ జాతి రత్నాలు సినిమాతో నిర్మాతగాను సక్సస్ అయ్యాడు. ఇక స్వప్న సినిమా బ్యానర్ నుంచి తర్వాత రాబోయే సినిమా గురించి అప్పుడే ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి.