Jathi ratnalu : జాతి రత్నాలు Jathi ratnalu సినిమా మీద ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై సినిమా టికెట్స్ బాగానే తెగినట్టు తెలుస్తోంది. స్వప్న సినిమా పతాకంపై మాహానటి సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించాడు. స్వప్న దత్, ప్రియాంక దత్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
అయితే ఈ సినిమాలో స్టార్స్ అంటూ ఎవరూ లేరు. హీరోయిన్ ఎవరో కూడా తెలీదు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో ప్రేక్షకుల్లో పాపులారిటీ తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి..అలాగే సినిమాలలో కామెడీ పాత్రలు చేస్తూ బాగా పేరు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి మాత్రమే సినిమాలో నటిస్తున్నారు. వీరి మీద సినిమా నిర్మించడం పెద్ద సాహసం. ఏమైనా కూడా కథ మీద నమ్మకంతోనే ధైర్యం చేయాలి. ఆ కథలో ఈ ముగ్గురి పాత్రలు హైలెట్ అయితే అప్పుడు జనాల టాక్ ని బట్టి వసూళ్ళు ఉంటాయి.
Jathi ratnalu : జాతి రత్నాలు వసూళ్ళు ఉప్పెన సినిమా స్థాయిలోఉంటాయని చెప్పుకుంటున్నారు.
కాని సినిమా మీద రిలీజ్ కి ముందే భారీ స్థాయిలో బజ్ క్రియేటవడం ఇప్పుడు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశాక బాగా ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ అయింది. ఒకరకంగా ప్రభాస్ చేసిన ప్రమోషన్ సినిమాకి బాగా ప్లస్ అయింది. చూడాలి మరి ఇంకొన్ని గంటల్లో జాతి రత్నాలు సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతోంది. ఇక ఈ సినిమాకి పిట్టగోడ అన్న సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన అనుదీప్ కె వి దర్శకత్వం వహించాడు. అంతేకాదు ఇప్పుడు ఈ సినిమా వసూళ్ళు ఉప్పెన సినిమా స్థాయిలోఉంటాయని చెప్పుకుంటున్నారు.