Jati rathnalu : జాతి రత్నాలు, గాలి సంపత్, శ్రీకారం.. ఈ మూడు సినిమాలు భారీ అంచనాల మధ్య మహా శివరాత్రి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రిలీజ్ కి వారం పదిరోజుల ముందు నుంచే సినిమాల మీద ప్రేక్షకుల్లో భారీగా బజ్ క్రియేటయ్యేలా మేకర్స్ బాగానే ప్లాన్ చేశారు. వాళ్ళ ప్లాన్ బాగానే వర్కౌట్ అయిందని చెప్పుకుంటున్నారు. అయితే రిలీజ్ కి ముందు ఏర్పడిన అంచనాలు బొమ్మ పడ్డాక మారిపోతాయి. అయితే సూపర్ హిట్.. లేదా అట్టర్ ఫ్లాప్.. ఈ రెండు కాకపోతే యావరేజ్ హిట్. ఒక్కోసారి రిజల్ట్ సంబంధం లేకుండా వసూళ్ళనే చెప్పుకుంటున్నారు.
మరి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూడు సినిమాలలో ఏ సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో అని ఆరా తీస్తే.. ముందుగా అందరూ జాతి రత్నాలు సినిమా గురించే మాట్లాడుతున్నారట. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో పేరు తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి తో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి నటించిన ఈ సినిమా అందరినీ బాగా ఆకట్టుకుంటుందట. ప్రమోషన్స్ లో ప్రభాస్ సపోర్ట్.. సినిమాలో కీర్తి సురేష్, విజయ్ దేవరకొండ గెస్ట్ అపీరియన్స్ సినిమాని నిలబెట్టాయి అంటున్నారు.
Jati rathnalu : జాతి రత్నాలు, గాలి సంపత్, శ్రీకారం ప్రేక్షకులను మెప్పించాయి.
ఇక ఆ తర్వాత శర్వానంద్ నటించిన ‘శ్రీకారం’ సినిమా కూడా ఫస్ట్ డే మంచి టాక్ తెచ్చుకుంది. శ్రీకారం జాతి రత్నాల కంటే కాస్త ఎక్కువే క్రేజ్ సంపాదించింది. ఈ సినిమాతో మళ్ళీ శర్వానంద్ ట్రాక్ ఎక్కినట్టే అంటున్నారు. కాగా మూడవ సినిమా గాలి సంపత్. శ్రీవిష్ణు – నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను బాగా మెప్పించిందన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి మేయిన్ హైలెట్ అంటున్నారు. ఆయన వల్ల సినిమా మరో రేంజ్ కి చేరుకుందని చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఈ మూడు సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఈ వారం ఆగితేగాని ఏ సినిమా వసూళ్ళు ఎంత రాబట్టిందన విషయం క్లారిటీ వస్తుంది.