Jatirathnam : జాతిరత్నం సినిమాతో టాలీవుడ్ లో బాగా పేరు తెచ్చుకున్న దర్శకుడు కెవి అనుదీప్. 2016లో పిట్టగోడ సినిమాతో దర్శకుడిగా మారిన అనుదీప్ ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇటీవల వచ్చిన జాతి రత్నం సినిమాతోనే వచ్చాడు. స్వప్న సినిమా బ్యానర్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించారు. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకొని భారీ స్థాయిలో వసూళ్ళు రాబట్టింది. ఈ సినిమా చిత్ర యూనిట్ కి వచ్చిన పేరు అంతా ఇంతా కాదు.
దాంతో ఇప్పుడు అందరి దృష్ఠి దర్శకుడు అనుదీప్ మీద పడింది. ప్రస్తుతం చిన్న నిర్మాతలతో పాటు పెద్ద నిర్మాతల చూపు కూడా అనుదీప్ పై పడిందని తెలుస్తోంది. జాతిరత్నాలు సినిమాతో తను సక్సెస్ అందుకోవడమే కాకుండా నిర్మాత నాగ్ అశ్విన్ కు కోట్లలో లాభాలు తెచ్చిపెట్టాడు అనుదీప్. కాగా నెక్స్ట్ అనుదీప్ ప్రాజెక్ట్స్ ఏంటీ ..ఏ బ్యానర్ లో చేస్తున్నాడు..హీరోలెవరు.. కథ ఏంటీ అని చర్చలు సాగుతున్నాయట. అటు సోషల్ మీడియాలో ఇటు సినీ వర్గాలలో ఇదే హాట్ టాపిక్ అయిందట.
Jatirathnam : రామ్, నవీన్ పొలిశెట్టి లతో అనుదీప్ నెక్స్ట్ సినిమాలు..?
అయితే తాజా సమాచారం ప్రకారం అనుదీప్ రెండు కథలను సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. స్వప్న సినిమా వైజయంతి బ్యానర్స్ లోనే నెక్స్ట్ సినిమా చేయనున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. అనుదీప్ నెక్స్ట్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సినిమా తీసేందుకు స్క్రిప్ట్ రెడీ చేసాడని సమాచారం. కామెడీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ ను హీరోగా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే నవీన్ పొలిశెట్టితో కూడా మరో సినిమా ఉంటుందని చెప్పాడు. అంతేగాక ఒక లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఈ మూడు ప్రాజెక్ట్స్ లో ముందు ఏ సినిమా పట్టాలెక్కుతుందన్న విషయం మాత్రం క్లారిటీ లేదు. త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.