JC Divakar Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వివిధ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సీనియర్ నేత జేసీ దివాకరరెడ్డి హైదరాబాద్ ప్రగతి భవన్ వద్ద హాల్ చల్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం అయ్యింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ను కలిసేందుకు వెళ్లిన జేసీకి అవమానం జరిగింది. అపాయింట్మెంట్ లేకుండా లోపలకు పంపించలేమని అక్కడి సెక్యూరిటీ అధికారులు ఆయనను నిలుపుదల చేశారు. సీఎం కేసిఆర్ లేకపోతే .. మంత్రి కేటిఆర్ ను కలుస్తానని జేసి అన్నారు. అయినా ముందస్తు అనుమతి కావాల్సిందేనని సెక్యూరిటీ అధికారులు చెప్పడంతో జేసీ అక్కడ నుండి వెనుతిరిగి వెళ్లిపోయారు. ఎవరైనా ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి కేటిఆర్ ను కలవాలన్నా, ప్రగతి భవన్ లోపలికి వెళ్లాలన్నా ముందస్తు ఆపాయింట్మెంట్ తీసుకుంటే తప్ప లోపలికి వెళ్లనివ్వరు.
JC Divakar Reddy: అనుమతి లేకుండా ప్రగతి భవన్ వద్దకు వెళ్లి..
అయితే జేసి దివాకరరెడ్డి ఎటువంటి అనుమతి లేకుండా నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది జేసీని అడ్డుకున్నారు. అనుమతి లేనిదే తాము లోపలకు అనుమతించలేమనీ, లేదా ప్రగతి భవన్ నుండి పెద్దలతో ఫోన్ అయినా చేయించాలని జేసీకి సెక్యురిటీ సిబ్బంది విజ్ఞప్తి చేశారు. అయితే తనకు అపాయింట్మెంట్ ఇచ్చేదేమిటి, తాను లోపలకు వెళతానంటూ సెక్యూరిటీ సిబ్బందితో జేసీ కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ ఆపాయింట్మెంట్ లేకుండా తాము లోపలికి అనుమతించలేమంటూ సెక్యూరిటీ సిబ్బంది నచ్చజెప్పడంతో జేసీ చేసేదేమీ లేక వెనుతిరిగారు.
సీనియర్ నేత అయిన జేసి దివాకరరెడ్డి వివిధ రాజకీయ పార్టీల నాయకులతో చనువుగా మాట్లాడుతూ ఉంటారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ రాజకీయాలకే పరిమితం అయిన జేసీ దివాకరరెడ్డి నేడు తెలంగాణ సీఎం కేసిఆర్ ను లేక మంత్రి కేటిఆర్ ను ఎందుకు కలవాలనుకున్నారు అనేది చర్చనీయాంశం అవుతోంది. సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పని చేసిన జేసీ దివాకరరెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవాలంటే ముందుగా ఆపాయింట్మెంట్ తీసుకోవాలనేది తెలియదా.. ? తెలిసీ అలా ఎందుకు వెళ్లారు..? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?