కడప కేంద్ర కారాగారంలో ఉంటోన్న జేసీ దివాకర్ రెడ్డికి బెయిల్ మంజూరైన విషయం తెల్సిందే. అక్రమ వాహనాల రిజిస్ట్రేషన్ కేసులో జేసీ, అతని కొడుకు అస్మిత్ రెడ్డిలను అరెస్ట్ చేసి 55 రోజులు రిమాండ్ లో ఉంచారు. అనంతరం బెయిల్ పై విడుదల కాగా జేసీ, అస్మిత్ అనుచరులతో భారీ ర్యాలీ కింద అనంతపురం వెళ్లారు.
మార్గమధ్యంలో పోలీసులు కోవిద్ నిబంధనలు ఉల్లఘించిన కారణంగా అడ్డగించారు. కోపంతో ఊగిపోయిన జేసీ తాడిపత్రి సీఐపై దుర్భాషలాడారు. దీంతో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. ఈ నేపథ్యంలో ఆయనకు కరోనా సోకింది. తనకు గతంలో గుండెకు శస్త్రచికిత్స కూడా జరిగిందని కాబట్టి ఆరోగ్య రీత్యా బెయిల్ మంజూరు చేయాలని కోరగా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. మరికొద్ది నిమిషాల్లో జేసీ విడుదల కానున్నారు.