నిబంధనలకు విరుద్దంగా బీఎస్ 3 వాహనాలను బిఎస్ 4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించారన్న అభియోగంపై నమోదైన కేసువిచారణలో భాగంగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిల పోలీసులు కస్టడీ మ్ముగిసింది. ఆ కస్టడీ సమయంలో సుమారు రెండు రోజుపాటు పోలీసులు వీరిద్దరినీ విచారించారు. ఈ సందర్భంలో పోలీసులు సుమారు 64 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పిన వీరిద్దరూ.. కొన్ని ప్రశ్నలకు మాత్రం అధికారులనే అడగండి వంటి ఆన్సర్స్ ఇచ్చారంట.
వాహనాల రిజిస్ట్రేషన్ లకు పోలీస్ క్లియరెన్స్ ఎలా వచ్చింది? నకిలీ ధ్రువపత్రాలు ఎవరు సృష్టించారు? ఈ విషయంలో ఎవరిపాత్ర ఎంత? ఇలాంటివి సుమారు 64 ప్రశ్నలు సంధించారంట పోలీసులు. అయితే వీటిలో కొన్ని ప్రశ్నలకు మాత్రం… ఈ విషయాలు అధికారులను ప్రశ్నిస్తేనే బాగుంటుందని సమాధానం చెప్పారంట జేసీ ప్రభాకర్ రెడ్డి. అంటే… ఈ లెక్కన నెక్స్ట్ ప్రశ్నలు ఎదుర్కోబోయేది జేసీ బ్రదర్స్ కి ఆస్కారమిచ్చిన అధికారులదే అంటున్నారు!!
ఈ విషయాలపై స్పందించిన జేసీ తరుపు న్యాయవాది.. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి సమాధానాలు ఇచ్చారని.. ఇదే క్రమంలో హైకోర్టులో బెయిల్ పిటిషన్ కూడా వేశామని తెలిపారు. కాగా.. కస్టడీ ముగిసిన అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు వారిద్దరినీ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కోసం కడప జైలుకు పంపారు!!