Jd Lakshmi Narayana : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల విషయంలో ఎన్నికల సంఘం వర్సెస్ ప్రభుత్వం అన్నరీతిలో పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎక్కడ కూడా ఏకగ్రీవాలు జరగకుండా తనదైన శైలిలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో పంచాయతీ ఎన్నికల విషయంలో అదే విధంగా ఏకగ్రీవాలు పై సంచలన కామెంట్స్ చేశారు మాజీ ఐఏఎస్ జేడీ లక్ష్మీనారాయణ. Jd Lakshmi Narayana ఆయన ఏమన్నారంటే గ్రామాలలో పై అమానుష ఘటనలు జరగకుండా ఏకగ్రీవ ఎన్నికలు ఎప్పటినుండో జరుగుతున్నాయని, పట్టణాలలో అయితే ఎలక్షన్ తర్వాత అంతా మర్చిపోయా వాతావరణం ఉంటుందని కాని గ్రామాలలో తక్కువ పరిధి ఉండటంతో గొడవలు జరగకుండా ఏకగ్రీవాలు అయ్యేవిధంగా వ్యవహరించే వారని తెలిపారు. ఇదే క్రమంలో ఏ గ్రామాల్లో అయితే ఏకగ్రీవ ఎన్నిక లు ప్రోత్సహిస్తాయో ఆ గ్రామాలకు ప్రభుత్వాలు ప్రోత్సాహాలు ఇవ్వటం జరుగుతుంది అని తెలిపారు. కాబట్టి వీలైతే జరగబోయే ఎన్నికలలో అందరి సమ్మతి బట్టి ఏకగ్రీవాలు జరిగితే బాగుంటుందని ఇది నా విన్నపం అంటూ జెడి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?