దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే జేఈఈ మెయిన్ 2023 పరీక్షల తేదీల కోసం లక్షలాది మంది విద్యార్ధినీ విద్యార్ధుల ఎదురుచూపులకు ఎట్టకేలకు తెరపడింది. జాతీయ పరీక్షల మండలి (ఎన్ టీ ఏ) గురువారం జేఈఈ మెయిన్ 2023 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రెండు విడతల్లో జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఎన్ టీ ఏ పేర్కొంది. జనవరిలో తొలి విడత, ఏప్రిల్ నెలలో రెండో విడత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.
జేఈఈ మెయిన్ తొలి సెషన్ ను జనవరి 24, 25, 27, 29, 30, 31 తేదీల్లో నిర్వహించనుండగా, రెండో సెషన్ ను ఏప్రిల్ 6 నుండి 12 వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు తెలిపింది. జేఈఈ మెయిన్ పరీక్షను 13 భాషల్లో (ఇంగ్లీషు, హిందీ, తెలుగు, అస్సామీ, బెంగాలీ, ఒడిశా, గుజరాతీ, మలయాళం, మరాఠీ, పంజాబీ, తమిళ్, ఉర్దూ) నిర్వహించనున్నారు. తొలి సెషన్ పరీక్ష లకు డిసెంబర్ 15వ తేదీ నుండి జనవరి 12 రాత్రి 9 గంటల వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చనీ, పరీక్ష ఫీజును జనవరి 12వ తేదీ రాత్రి 11.50 గంటల వరకూ చెల్లించవచ్చని తెలిపింది. ఏ పట్టణంలో పరీక్ష నిర్వహిస్తామనేది జనవరి రెండో వారంలో ప్రకటించడం జరుగుతుందనీ, అడ్మిన్ కార్డులను జనవరి మూడో వారంలో ఎన్టీఏ వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది.
Viral Video: ట్రక్కు నుండి జారిన తాడు బైక్ పై వెళుతున్న యువకుడి మెడకు.. ఆ తర్వాత ఏమైందంటే..?