నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్టీఏ) ఈ రోజు జేఈఈ మెయిన్ ఫలితాలను విడుదల చేసింది. జేఈఈ మెయిన్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ లో 24 మంది 100 ఎన్టీఏ స్కోర్ తెచ్చుకున్నారు. వీరిలో అత్యధికంగా పది మంది తెలుగు విద్యార్ధులు ఉండటం విశేషం. ఏపికి చెందిన అయిదుగురు, తెలంగాణ కు చెందిన అయిదుగురు వంద శాతం మార్కులు సాధించి సత్తా చాటారు.
ఏపికి చెందిన పి రవి కిషోర్, పి కార్తికేయ, ఎం హిమవంశీ, కే సుభాష్, పి జలజాక్షి, తెలంగాణకు చెందిన బి రూపేష్, కే దీరజ్, వివిఎస్ జాస్తి యశ్వంత్, బి శివ నాగ వెంకట ఆదిత్య, ఎ చటోపాధ్యాయలు 100 ఎన్టీఏ స్కోర్ సాధించారు. జేఈఈ పరీక్షకు సంబంధించి జూలై 25, జూలై 30 తేదీల్లో రెండు షిప్ట్ ల్లో పరీక్షలు నిర్వహించగా, జవాబు కీని ఆగస్టు 3న విడుదల చేసి, నేడు పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ విడుదల చేసింది. ఈ సారి దాదాపు 6.29 లక్షల మంది విద్యార్ధులు పరీక్షకు హజరైయ్యారు. అభ్యర్ధులు జెఈఈ మెయిన్ స్కోర్ కార్డ్ ని అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in, ntaresults.nic.in నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.