అమరావతి: జెరూసలేం వెళ్లే యాత్రికులకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జెరూసలేం యాత్రికుల ఆర్థిక సహాయం పెంపుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన గత నెల 30వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు.
వార్షిక ఆదాయం మూడు లక్షల రూపాయలు ఉన్న వారికి ఇచ్చే ఆర్థిక సాయం 40 వేల రూపాయల నుండి 60 వేల రూపాయలకు, మూడు లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న వారికి 20 వేల రూపాయల నుండి 30 వేల రూపాయల వరకూ ఆర్థిక సాయం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.