రిలయన్స్ జియో క్రికెట్ ప్రియుల కోసం కొత్తగా ఓ ప్యాక్ను ప్రవేశ పెట్టింది. రూ.499 ప్లాన్ను క్రికెట్ ప్యాక్ పేరిట అందిస్తోంది. దీంట్లో వినియోగదారులకు కాల్స్, ఎస్ఎంఎస్లు రావు. అయినప్పటికీ వారు మొబైల్ డేటాను ఉపయోగించుకోవచ్చు. రానున్న ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో జియో ఈ ప్యాక్ను కొత్తగా ప్రవేశపెట్టింది. దీంతో నిత్యం 1.5 జీబీ డేటాను వాడుకోవచ్చు. ఈ ప్లాన్ 56 రోజుల వాలిడిటీని కలిగి ఉంది.
రూ.777 తో మరో ప్లాన్ను కూడా జియో ప్రవేశపెట్టింది. దీంట్లో రోజుకు 1.5జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు వస్తాయి. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అదనంగా మరో 5జీబీ డేటా కూడా వస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల వాలిడిటీని కలిగి ఉంది. ఈ రెండు ప్లాన్లతోనూ జియో ఏడాది పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్కు ఉచితంగా సబ్ స్క్రిప్షన్ను అందిస్తోంది. ఏ ప్లాన్ను రీచార్జి చేసుకున్నా హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా ఏడాదిపాటు పొందవచ్చు.
అయితే ఏడాది పాటు హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను వాడుకోవాలంటే వినియోగదారులు పైన తెలిపిన రెండు ప్లాన్లలో ఏదో ఒక ప్లాన్ను ఎప్పటికప్పుడు రీచార్జి చేయించాలి. ఈ ప్లాన్లను జియో వెబ్సైట్ లేదా యాప్, జియో స్టోర్లలో వినియోగదారులు రీచార్జి చేసుకుని వాడవచ్చు.
ఇక ఈ ఏడాది జూన్లో జియో రూ.401 ప్లాన్ను ఇప్పటికే ప్రవేశపెట్టింది. అందులో రోజుకు 3జీబీ డేటా లభిస్తుంది. అదనంగా మరో 6జీబీ డేటాను ఇస్తారు. జియో టు జియో అన్లిమిటెడ్ కాల్స్, జియో టు నాన్ జియో 1000 నిమిషాలు ఉచితంగా వస్తాయి. నిత్యం 100 ఎస్ఎంఎస్ లను వాడుకోవచ్చు. ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీని కలిగి ఉంది. దీనికి కూడా ఏడాది పాటు ఉచితంగా హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.