ప్రపంచంలోనే అగ్ర రాజ్యమయిన అమెరికా లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. ఇటీవల అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఒక పెద్ద సాహసాన్ని చేయబోతున్నారు. ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ సేఫ్ మాత్రం కాదు. అలా అని లోపాలున్నాయి అని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే వాక్సిన్ ఒక్కొక్కరి శరీరంపై ఒక్కోలా ప్రభావం చూపిస్తుంది.
కాబట్టి ఈ వాక్సిన్ ను పలు జాగ్రత్తల మధ్యన వేయించుకోవాల్సిన అవసరం చాలా ఉంది అని పెద్ద ఎత్తున అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడు ఏ వ్యాక్సిన్ ను ఇంత త్వరగా రూపొందించలేదు. అంతేకాకుండా ఇప్పటికే వ్యాక్సిన్ వేయించుకున్న వారికీ ఎదురయిన ఆరోగ్య సమస్యలు ప్రజలలో కొత్త సందేహాలకు దారి తీస్తున్నాయి.
ప్రస్తుతం కరోనా అమెరికా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ను వెనువెంటనే అందుబాటులోకి తీసుకురావలిసిన అవసరం ఎంతయినా ఉంది. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమనగా వ్యాక్సిన్ మీద ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సందేహాలు ఉండడంతో అమెరికన్లు టీకా లను వేయించుకోవడానికి ముందుకు రావడంలేదు.
ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ప్రజలకు టీకా చాలా అవసరం కాబట్టి ప్రజల్లో ఉన్న డౌట్లను క్లియర్ చేయడానికి తాజాగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ స్వయంగా రంగంలోకి దిగి ఈ సాహసం చేయనున్నారు. అమెరికా ప్రజల్లో నమ్మకాన్నికలిగించడానికి స్వయంగా ఆయనే బహిరంగంగా టీకాను వేయించుకోవటానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు ఏ అధ్యక్షుడు చెయ్యని సాహసం బైడెన్ చేస్తున్నందుకు అమెరికన్లు చాలా సంతోషపడుతున్నారు.
తాజాగా ఒక కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ తాను మొదట టీకా వేయించుకోవాలని అనుకోలేదని కానీ ఇప్పుడు ప్రజల్లో నమ్మకం కలిగించటం కోసం మరియు టీకా సురక్షితమైనదన్న విషయాన్ని వారికి తెలియజేయటం కోసం మాత్రమే టీకా వేయించుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?