అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరిగిన సంగతి తెలిసిందే. జరిగిన ఎన్నికలలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడేన్ గెలవటం మనకందరికీ తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కంటే ఎక్కువ స్థానాలు గెలిచిన జో బైడేన్ తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన భారతీయుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది.
పూర్తి విషయంలోకి వెళ్తే ఎన్నికల ప్రచారంలో అమెరికాలో ఉన్న కోటి పది లక్షల మంది వలసదారులకు అమెరికన్ సిటిజెన్షిప్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దేశంలో ఉన్న 11 మిలియన్ల వలసదారులకు జో బైడేన్ అమెరికన్ సిటిజన్ షిప్ ఇచ్చే రీతిలో వ్యవహరిస్తున్న నేపథ్యంలో దీంతో హెచ్ వన్ బీ వీసాలకు సంబంధించి దాదాపు ఇండియన్స్ కి 5 లక్షల మందికి అవకాశం రాబోతున్నట్లు లెక్క తేలుతోంది.
ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుండి హెచ్ వన్ బీ వీసాలకు సంబంధించి ఆంక్షలు విధించిన నేపథ్యంలో తాజాగా జో బైడేన్ దానికి భిన్నంగా ఎన్నికల లో ఇచ్చిన హామీ నెరవేర్చాలని కి ముందుకు రాబోతున్నాట్లు సమాచారం. దీంతో చాలావరకు అమెరికాలో స్టిరా పడాలి అనుకుంటున్నా భారతీయుల కోరిక కొత్త అధ్యక్షుడు జో బైడేన్ తీర్చ పోతున్నట్లు అమెరికా మీడియా ఛానల్స్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి.