హైదరాబాదు: వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి సమక్షంలో మంగళవారం నెల్లూరు, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు ప్రముఖులు వైసిపిలో చేరారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ దొంతు శారత, ఆమె భర్త దొంతు బాలకృష్ణలు వైసిపిలో చేరారు. మాజీ మంత్రి అనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో వీరు వైసిపిలో చేరగా జగన్మోహనరెడ్డి వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
గుంటూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు సోదరుడు , గుంటూరు మాజీ డిప్యూటి మేయర్ తాడిశెట్టి మురళి వైసిపి చేరగా ఆయనకు జగన్మోహనరెడ్డి పార్టీ కండువా కప్పారు. వైసిపి నేత అంబటి రాంబాబు ఆధ్వర్యంలో మురళి పార్టీలో చేరారు.