Jonty Rhodes: క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ బెస్ట్ ఫీల్డర్.. కళ్లు చెదిరిపోయే క్యాచ్ లు పట్టిన ఆటగాడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా ప్లేయర్ జాంటీ రోడ్స్ మాత్రమే. ఎంత దూరంలో ఉన్న అయినా సరిగ్గా వికెట్ల దగ్గరికి బంతిని త్రో చేయటం మాత్రమే కాక ఇద్దరు.. ముగ్గురు కాయాల్సిన ఫీల్డింగ్.. కాస్తు బ్యాట్స్మెన్ లను ముప్పుతిప్పలు పెట్టేవాడు. జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ లో ఉన్నాడు అంటే అటువైపు బంతి కొట్టినా గాని.. క్రీజ్ లో బ్యాటింగ్ చేస్తున్న ప్లేయర్ పరిగెత్తనీ పరిస్థితి.
అటువంటి జాంటీ రోడ్స్.. తాజాగా టీమిండియాలో బెస్ట్ ఫీల్డర్ ఎవరు అన్నదానిపై తనదైన శైలిలో కామెంట్లు చేశాడు. టీమిండియాలో ఫీల్డింగ్ అనే పట్టికి చాలామందికి.. గుర్తుకు వచ్చే పేర్లు యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్. వారిద్దరూ అప్పట్లో బాగానే కవర్ చేసేవారు. అయితే ప్రస్తుతం ఎక్కువగా వినబడుతున్న పేరు విరాట్ కోహ్లీ. టీమిండియాలో బాగా ఫీల్డింగ్, త్రో, క్యాచ్ లు పట్టే విషయంలో అతని ని ఎక్కువగా గుర్తిస్తారు కానీ నా దృష్టిలో టీమ్ ఇండియాలో బెస్ట్ ఫీల్డర్ మాత్రం సురేష్ రైనా… అంటూ జాంటీ రోడ్స్ తన అభిప్రాయాన్ని తెలిపారు.
Read More: Cricket: మరో స్టార్ క్రికెటర్ బయోపిక్ సెట్స్ పైకి..??
పరుగులు ఆ పటంలో బాగా కవర్ చేయటం లో… సరిగ్గా వికెట్ల దగ్గరికి త్రో విసరడంలో.. సురేష్ రైనా టైమింగ్ చాలా బాగుంటుంది అని జాంటీ రోడ్స్.. తన దృష్టిలో విరాట్ కోహ్లీ కంటే బెస్ట్ ఫీల్డర్ సురేష్ రైనా అని కుండబద్దలు కొట్టే కామెంట్లు చేశాడు.