Judge Ramakrishna: జగన్ ప్రభుత్వం జడ్జి రామకృష్ణ పై బ్రహ్మాస్త్రం విసిరిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా పీలేరు కు చెందిన జయరామచంద్రయ్య అనే వ్యక్తి జడ్జి రామకృష్ణ పై ఫిర్యాదు చేస్తే దాన్ని మేరకు ఐపీసీ సెక్షన్ 164 కింద పీలేరు పోలీసులు ఏకంగా రామకృష్ణ పై దేశ ద్రోహం కేసు నమోదు చేయడం సంచలనం అయింది.
ఇందులో ఫిర్యాదు చేసిన జై రామచంద్రయ్య…. రామకృష్ణ వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్ ను ఆస్థిరపరుస్తూ ఉన్నాయని ఫిర్యాదు చేయడం గమనార్హం. దీంతో రామకృష్ణ ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు. సబ్ జైల్లో ఉన్న జడ్జి రామకృష్ణ ఇప్పుడు సీఎం జగప్ మోహన్ రెడ్డి పై సంచలన ఫిర్యాదు చేశారు. 2017 ఈ సంవత్సరం లో జగన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఆయన ఇప్పుడు హైలైట్ చేసి ఫిర్యాదు చేయడంతో ఈ ఈ వివాదం మరింత రసవత్తరంగా తయారయింది.
జడ్జి రామకృష్ణ తన స్వహస్తాలతో వ్రాసిన లేఖపూర్వకమైన ఫిర్యాదులో… పీలేరు ఇన్స్పెక్టర్ కు ఒక విన్నపం లాగా ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి 2017 నంద్యాల బై ఎలక్షన్ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారిని నడి రోడ్డు లో కాల్చి చంపమని పిలుపునిచ్చారని… అప్పటినుండి తన మనోభావాలు దెబ్బతిని మానసికంగా కృంగిపోతున్నాను అని వివరిస్తూ రామకృష్ణ గారు ఈ లేఖ రాయడం జరిగింది.
రాష్ట్రంలో శాంతిభద్రతలు ముఖ్యంగా దళితుల పరిస్థితి దయనీయంగా ఉందని కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పై చట్టరీత్య చర్య తీసుకోవాలని ప్రార్థిస్తున్నట్లు రామకృష్ణ ఈ లేఖలో తెలపడం గమనార్హం. ఇక అంతే కాకుండా గతంలో తాను ఏబిఎన్ డిబేట్ లో దళితులపై దాడుల గురించి అంతర్జాతీయ నివేదికపై చర్చ సందర్భంగా కూడా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు.
కాబట్టి వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరడం జరిగింది. ఇప్పుడు పీలేరు పోలీసులు ఈ విషయంపై ఎంత వరకు వెళ్తారు అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Complaint by Judge Rama Krishna (1)