Junior Artist Jyothi Reddy Death: కడపకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి రైలు ప్రమాదంలో మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ స్టేషన్ లో మంగళవారం తెల్లవారుజామున రైలు దిగి మళ్లీ ఎక్కుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..జ్యోతిరెడ్డి (28) హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పని చేస్తోంది. సంక్రాంతి పండుగ నిమిత్తం ఇటీవల స్వస్థలం కడపకు వెళ్లింది. సోమవారం రాత్రి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో తిరిగి హైదరాబాద్ కు పయనమైంది. మంగళవారం తెల్లవారుజామున నిద్రమత్తులో జ్యోతిరెడ్డి కాచికూడ స్టేషన్ వచ్చేసింది అనుకుని షాద్ నగర్ రైల్వే స్టేషన్ లో దిగింది. కాచికూడ స్టేషన్ కాదని తెలుసుకుని వెంటనే రైలు ఎక్కేందుకు ప్రయత్నించడంతో రైలు కదలడంతో అదుపుతప్పి ఫ్లాట్ ఫామ్ పై పడిపోయింది.
Junior Artist Jyothi Reddy Death: ఆసుపత్రి వద్ద ఆందోళన
ఈ ప్రమాదంలో జ్యోతిరెడ్డి తలకు బలమైన గాయం కావడంతో రైల్వే సిబ్బంది ఆమెను ఉస్మానియా ఆసుపత్రి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు జ్యోతిరెడ్డిని మలక్పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందింది. జ్యోతిరెడ్డి మృతితో ఆమె కుటుంబ సభ్యులు, జూనియర్ ఆర్టిస్టులు ఆ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ఛాదర్ ఘాట్ పోలీసులు అక్కడికి చేరుకుని జ్యోతిరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More: Sreeja Kalyan: శ్రీజ విడాకుల పుకార్ల మీద ఆమె భర్త కళ్యాణ్ దేవ్ స్పందన..?