Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరి క్రిష్ణ కూడా రోడ్డు ప్రమాదం లోనే చనిపోయారు.. అప్పటినుంచి రోడ్డు ప్రమాదాల విషయం లో సామజిక బాధ్యతగా తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ పలు సందేశాలను ఇస్తున్నారు.. ఆయన ప్రతి సినిమాలోనూ ముందుగా రోడ్డు ప్రమాదాల పై అప్రమత్తం చేసే ఒక సందేశం కచ్చితంగా ఉంటుంది.. జాతీయ రహదారి భద్రత మాసంలో భాగంగా సైబారాబాద్ లో ట్రాఫిక్ పోలీసుల వార్షిక సమావేశం జరిగింది.. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యి జెండా ఊపి పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించారు.. దీనికి అడిషనల్ డీజీ రైల్వేస్ సందీప్ శాండిల్య , సీపీ సజ్జనార్ , ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ హాజరయ్యారు..
ఈ సందర్భం గా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ సైబారాబాద్ పోలీసుల సేవలను మెచ్చుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు రహదారి భద్రత విషయంలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నారని ఆయన అన్నారు. వాహన దారులకు ట్రాఫిక్ రూల్స్.. డ్రైవింగ్ పట్ల అవగాహన పెంపొందించడం లో సైబారాబాద్ ట్రాఫిక్ పోలీసులు ముందు ఉన్నారు.. వాహన వేగం, డ్రైవర్ కంటి చూపు మధ్య గురించి వివరిస్తూ సైబారాబాద్ ట్రాఫిక్ పోలీసులు వివరణాత్మక ట్వీట్ చేసారు.