ప్రభాస్ టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తున్న సినిమా రాధే శ్యామ్. రాధకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. గోపీకృష్ణ మూవీస్, యూవి క్రియేషన్స్ పతాకాలపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతుందని సమాచారం. అంతేకాదు ప్రభాస్ – పూజా హెగ్డే డ్యూయల్ రోల్ లో కనిపిస్తారన్న టాక్ కూడా ఉంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెల్సిందే. టాలీవుడ్ లో భాగ్యశ్రీ నటిస్తున్న డెబ్యూ సినిమా కావడంతో దర్శకుడు రాధకృష్ణ తన క్యారెక్టర్ ని ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేశాడట.
కాగా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ కంప్లీట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇండస్ట్రీలో గత కొన్నాళ్ళుగా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా రాధే శ్యామ్ గురించి చర్చలు సాగుతున్నాయి. చాలా కాలం తర్వాత ప్రభాస్ రాధే శ్యామ్ తో అద్భుతమైన లవ్ స్టోరీ చేస్తున్నాడు. పీరియాడికల్ లవ్ స్టోరీగా రాధకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య గా పూజా హెగ్డే ప్రేరణ గా నటిస్తున్నారు. అంతేకాదు ప్రభాస్ చెల్లి ప్రశీద ఈ సినిమాతో నిర్మతగానూ మారుతోంది. అందుకే ఈ సినిమాతో చెల్లికి భారీ గిఫ్ట్ ఇస్తానని ప్రామిస్ చేశాడట ప్రభాస్.
అయితే ఇప్పుడు ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో భారీగా చర్చలు జరుగుతున్నాయట. రాధే శ్యామ్ లో క్లైమాక్స్ హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఉంటుందని ఇలాంటి క్లైమాక్స్ ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలో కూడా చూడలేదని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఈ సినిమా క్లైమాక్స్ కోసమే భారీగా ఖర్చు కూడా చేస్తున్నారట. దాంతో అంతకంతగా రాధే శ్యామ్ సినిమా మీద దేశమంతా భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. కాగా ఈ సినిమా దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ మంచి డేట్ చూస్తున్నట్టు సమాచారం.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!