ప్రపంచంలో యువ రక్తం పరుగులు పెడుతుంది. యువ జనాభా ఉరకలు వేస్తుంది. ప్రపంచ జనాభాలో 30 వయస్సు కల్గిన వాళ్లు 30 నుండి 35 శాతం మంది ఉన్నారు. ఆధునికతను శాసించాల్సింది కూడా యువతే. సరే, యువత రాజకీయాలలోకి రావాలి దేశాన్ని పాలించాలి అన్ని సందేశాలు ఇస్తున్న అధినేతలు, సందేశాలు ఇవ్వడం వరకే పరిమితం అవుతున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షా ఎన్నికలలో పొట్టి పడిన ఇద్దరు ముసలి వాళ్ల భాగోతం చూస్తే ఇదే అనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తం గా ఉన్న అధ్యక్షులలో కాస్త ఎక్కువ వయస్సు ఉన్నది ట్రంప్ అనే అనుకున్నాము. ట్రంప్ నే ముసలి తాత అన్నాము. ఇప్పుడు ఆయనకు మించిన వయస్సు తో, బైడెన్ తాతా అధ్యక్షుడు అవ్వగా, అయినా పదవి కలం పూర్తి అయ్యేసరికి అతన్ని వయస్సు 81 సంవత్సరాలు నిండిపోతాయి.మరి ఈ అగ్ర రాజ్యం ప్రపంచానికి ఏమి సందేశం ఇస్తుంది అనేది గమనార్హం.
అమెరికా, ప్రపంచదేశాలు అన్నిటిలో అగ్ర రాజ్యం. ఆ దేశ అధ్యక్షుడు అక్కడి ప్రభుత్వానికి అధిపతి. అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం ప్రకారం, కార్యనిర్వహణ శాఖ అధినేతగా, ఫెడరల్ ప్రభుత్వాధినేతగా గల అధ్యక్ష పదవి అమెరికాలో అత్యున్నతమైన పదవి. అమెరికా అధ్యక్షుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని సైనిక బలగాలకు కమాండర్ ఇన్ ఛీఫ్ గా వ్యవహరిస్తారు. అంతే కాకూండా అమెరికా అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలు పరోక్షంగానూ ప్రపంచ దేశాల మీద కూడా ప్రభావం చూపుతుంటాయి. అయితే ప్రస్తుత అధ్యక్షా ఎన్నికల పొట్టి జో బైడెన్,ట్రంప్ మధ్య కొన్నసాగిన విషయం తెలిసిందే. అధ్యక్షా పదవికి ఎంపికయిన జో బైడెన్ వయసు 77 సంవత్సరాలు. అమెరికా అధ్యక్షా పదవి చేపట్టిన వాళ్లలో ఇతనే వృధాప్య వయసు ఉన్న వ్యక్తి అయ్యాడు. ఇంత వృధాప్య వయసులో, ప్రపంచ దేశాల్ని శాసించే అగ్రరాజ్య నేత అవడం అనేది గమనార్హం.
సన్నా మారిన్(34) ఫిన్లాండ్ యువ అధ్యక్షురాలు, న్యూజీలాండ్ అధ్యక్షురాలు జెసిండా ఆర్డెర్న్(40), నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (35) ఇలా ప్రపంచ దేశాలు యువ రాజకీయ నేతలను ఎన్నుకుంటున్న వేళ, అగ్ర రాజ్యంలో మాత్రం వృధాప్య వయస్సు ఉన్న వ్యక్తి అధ్యక్షుడు గా పదవిని చేపట్టనున్నాడు. ఇది ఇలా ఉంటె మన దేశం లో రాజకీయ నాయకులూ పదవి పైబడడం తో తమ రాజకీయ వారసుల్ని ఎన్నుకున్నే పనిలో పడ్డారు. భారత దేశంలో ప్రధానిగా పదవి బాధ్యతలు చేపడుతున్న నరేంద్ర మోడీ, వయస్సు 70 సంవత్సరాలు కావడం వల్ల ఈయన 2024 ఎన్నికలలో పొట్టి చేయబోరు అన్ని, అయినా తరువాత రాజకీయ వారసుడిగా ఎవర్ని ఎన్నుకుంటారు అనే విషయం మీద ఇప్పటికే బీజేపీ వర్గాలలో చర్చలు మొదలయ్యాయి. 69 సంవత్సరాల వయస్సు ఉన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా వయస్సు కారణంగానే రాజకీయాలనుండి తప్పుకుంటాను అన్ని, ఇవే తన చివరి ఎన్నికలు అన్ని, రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలతో రిటైర్మెంట్ పలుకుతున్నా అన్ని ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల నుండి రాజకీయాలలో ఉన్నపటికి, 70 సంవత్సరాలు నిండడం తో తమ పార్టీ బాధ్యతలను కొడుకుకి అందచేసే ఆలోచనలలో ఉన్నారు. ఇదే బాటలో తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అడుగులు వేస్తున్నారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
వయస్సు పైబడిన నేతలు క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకుంటున వేళ్ళ అగ్ర రాజ్యం అయినా అమెరికాలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఇప్పటికే 70 ఏళ్ల వయసులో పదవి బాధ్యతలు చేపట్టిన వ్యక్తి గా ట్రంప్ రికార్డు లలోకి ఎక్కారు. ఇపుడు 77 ఏళ్ల వయస్సు ఉన్న జో బైడెన్ అధ్యక్షా పదవి రేస్ లో మొదటి నుండి ముందంజలో ఉండి, ఇప్పుడు అధ్యక్షా పదవిని చేపట్టాడు. ప్రపంచదేశాలు అన్ని ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్షా ఎన్నికల ఫలితాలలో గెల్చిన జో బైడెన్, అధ్యక్షా పదవి చేపట్టిన వయోధికుడు గా రికార్డులోకి ఎక్కుతారు. గెల్చిన వారు వృధాప్య వయసులో కూడా అధ్యక్షా పదవిని చెప్పటి ప్రపంచదేశాలకి ఏమి సందేశం ఇస్తారో వేచి చూడాల్సిందే.