రెండు తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. చాలా మంది రాజకీయ నాయకులతో పాటు సెలబ్రిటీలు కూడా భోగి వేడుకల్లో పాల్గొనే వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఏపీ ప్రతిపక్ష నేత టిడిపి నాయకుడు చంద్రబాబు నాయుడు జగన్ సర్కార్ తీసుకొచ్చిన జీవోలను భోగిమంటల్లో వేసి.. రైతులను వైసీపీ ప్రభుత్వం వేధిస్తుంది అన్నట్టు డైలాగులు వేశారు.
ఇదే క్రమంలో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె ఏ పాల్ 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు భోగి శుభాకాంక్షలు అమెరికాలో ఉండే సోషల్ మీడియాలో వీడియో రూపంలో తెలిపారు. ఈ సందర్భంగా చిన్ననాటి టైం లో భోగి పండుగ గురించి ఒక సంఘటన గుర్తు చేసుకున్నారు. చిన్ననాటి టైమ్ లో సారేపల్లి లో భోగి పండుగ తరుణంలో..బంధువులు స్నేహితులు సరదాగా తనని భోగిమంటల్లో తోసినట్లు తెలిపారు.
కనుక భోగి పండుగ చేస్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఇదే క్రమంలో కుల రాజకీయాలు అదేవిధంగా మత రాజకీయాలు చేసే బండి సంజయ్, చంద్రబాబు నాయుడు ఇలాంటివారిని మంటల్లో కలిపేయాలని కె ఏ పాల్ పిలుపునిచ్చారు. దేవుళ్ళ పేరట ప్రజల మధ్య తమ స్వార్థ రాజకీయాల కోసం గొడవలు పెట్టి ఇలాంటి నాయకుల ఆగడాలను ప్రజలు ఖండించాలని సూచించారు.