కడప: రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కడప జిల్లా అఖిలపక్ష కమిటీ తీర్మానించింది. నగరంలోని ప్రెస్ క్లబ్లో కడప అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నేతలు రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ రాజధానుల వికేంద్రీకరణ కాదని అన్నారు. మూడు రాజధానుల ఆలోచనను ముఖ్యమంత్రి విరమించుకోవాలని నేతలు సూచించారు. ఈ ప్రతిపాదన విరమించుకోకుంటే అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఉద్యమాలకు సిద్ధం అవుతామని హెచ్చరించారు. ఈ సమావేసంలో టిడిపి, బిజెపి, కాంగ్రెస్, సిపిఐ, జనసేన నేతలు పాల్గొన్నారు.
previous post