Kajal agarwal : కాజల్ అగర్వాల్ పెళ్ళికి ముందు కమిటయిన ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తూనే పెళ్ళి తర్వాత వరుసగా వెబ్ సిరీస్లు సినిమాలు కమిటవుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో ఆయనకి జంటగా నటిస్తోంది. మెగా పవర్ స్టార్ రాం చరణ్ మరొక హీరోగా నటిస్తుండగా పూజా హెగ్డే చరణ్ కి జంటగా కనిపించబోతోంది. మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయిన ఆచార్య బ్యాలెన్స్ షూటింగ్ త్వరలో పూర్తి చేయనున్నారు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా మేకర్స్ డిసైడ్ చేయలేదు. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులన్నీ చక్కబడితే భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.
ఈ సినిమా తర్వాత నాగార్జున నటిస్తున్న సినిమాలోనూ కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. పాన్ ఇండియన్ సినిమా ఇండియన్ 2లో కమల్ హాసన్ కి జంటగా నటిస్తోంది. ఇలా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న కాజల్ మరిన్ని ప్రాజెక్ట్స్ చేసేందుకు మేకర్స్ కి సహకరిస్తుందట. అదేమిటంటే తన రెమ్యునరేషన్ తగ్గించుకుందని సమాచారం. ప్రస్తుతం కరోనా కారణంగా ఇండస్ట్రీ మొత్తం ఇబ్బందుల్లో పడింది. దీంతో నిర్మాతల పరిస్థితులన్నీ మారిపోయాయి.
Kajal agarwal : కాజల్ మరో థ్రిల్లర్ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.
మంచి సినిమాలు రావాలంటే స్వతంత్రంగా హీరోలు, హీరోయిన్లు, దర్శకులు తమ రెమ్యునరేషన్ తగ్గించుకుంటే చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ విషయం దృష్టిలో పెట్టుకునే కాజల్ ఇకపై కమిటవబోయే సినిమాలకు గానీ, వెబ్ సిరీస్లకు గాని రీజనబుల్ రెమ్యూనరేషన్ తీసుకోవాలనుకుంటుందట. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీ వర్గాలకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందట. కాజల్ తీసుకున్న ఈ నిర్ణయానికి పలువురు ఇండస్ట్రీ వర్గాలు..అభిమానులు అభినందిస్తున్నారట. కాగా కాజల్ మరో థ్రిల్లర్ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.