పంచదార బొమ్మ తన ఫ్యాన్స్ కు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తోంది. ఈ చిన్నది పెళ్లి చేసుకుంటుంది అని తెలిసిన రోజు నుంచి తన ఫ్యాన్స్ కు నిద్ర లేకుండా పోయింది. తన పెళ్లి కూడా ప్రేమ పెళ్లి అని చెప్పడంతో తన ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు. ఇక పెళ్లి తర్వాత హానిమూన్ కు మాల్దీవులకు వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మిత్రవింద మాల్దీవుల్లో చేసిన రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది.
మాల్దీవులను భూతల స్వర్గంగా చెబుతారని మనకు తెలిసిందే. అందుకే సినీ యాక్టర్లు ఆ ప్లేసును ఎక్కువగా ఎంచుకుంటారు. ఇక హనీమూన్ కు తన భర్తతో వెళ్లిన కాజల్ అక్కడ పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తుంది అనడానికి సోషల్ మీడియాలో తను పోస్ట్ చేసిన ఫొటోలే నిదర్శణం. అయితే కాజల్ తన ఇన్ స్టా ద్వారా ఎప్పటికప్పుడు తన అప్ డేట్లను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య పోస్ట్ చేసిన ఫొటోలు తను ఎంత ఆనందంగా ఉందో తెలుపుతున్నాయి.
మాల్దీవుల ప్రకృతిని ఆస్వాధిస్తూ.. సముద్ర గర్భంలో ఉండి ఫొటోలు తీయించుకుంది ఈ సుందరి. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోల్లో వారు సాహసాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖానికి ఆక్సిజన్ మాస్కులను పెట్టుకుని స్కూబా డైవ్ చేస్తున్నారు ఈ నవ దంపతులు. ఈ అద్బుత ఫొటోలను కాజల్ తన ఫ్యాన్స్ తో పంచుకుంది. ఈ ఫొటోలు చూసిన తన ఫ్యాన్స్ నమ్మలేక పోతున్నారు. అమాయకంగా ఉండే ఈ చిన్నదేనా అని ముక్కున వేలేసుకుంటున్నారు.
ఈ చందమామ ఫొటోలను ఇన్ స్టా ద్వారా పోస్ట్ చేయడమే కాకుండా చార్బెల్ టాడ్రోస్ చెప్పిన మాటలను కామెంట్ చేసింది. విశ్వం ఒక సముద్రం, మనం దానిపై తరంగాలం. దానిమీద కొందరు సర్ఫ్ చేయాలను కుంటారు. కానీ మరికొందరు డైవ్ చేయడానికి సాహసం చేయలేరని రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన వారంతా ఒక పక్క ఆశ్చర్యానికి గురవుతున్నారు. హనీమూన్ ను ఎంతో గొప్పగా ఎంజాయ్ చేస్తోందని కామెంట్లు పెడుతున్నారు. ఈ మిత్రవిందకు అక్టోబర్ 30న పెళ్లి అయిపోయిన సంగతి తెలిసిందే. దాంతో తన భర్త గౌతమ్ తో వారం క్రితం మాల్దీవులకి వెళ్లింది. ఇక అక్కడ ఎంతో ఎంజాయ్ చేస్తోంది.