ఆడవాళ్ల అందాన్ని రెట్టింపు చేసే వాటిలో జుట్టు ప్రధాన పాత్రను పోషిస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో జుట్టు రాలే సమస్య కూడా ఒకటి అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదనే చెప్పాలి.మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే బట్టతల రావడం,జుట్టు తెల్లగా మారడం,చుండ్రు లాంటి సమస్యలు వస్తున్నాయి. కెమికల్స్ ఎక్కువగా ఉన్న షాంపూలు, ఆయిల్స్, కలర్స్, డైస్ వంటివి ఎక్కువగా వాడడం వలన సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వచ్చి జుట్టు ఊడిపోవడం జరుగుతుంది.
జుట్టు ఊడకుండా ఉండాలంటే..?
మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్ వాడే కంటే నేచురల్ రెమిడీస్ తో మీ జుట్టు సమస్యలను తగ్గించుకొండి. ఇంట్లో దొరికే వాటితోనే మేము చెప్పే ఈ చిన్న చిట్కాను పాటించి మీ జుట్టు యొక్క అందాన్ని మరింత రెట్టింపు చేసుకోండి. మరి దీనికి కావలసిన పదార్ధాలు ఏంటో చూద్దామా.. కలోంజి గింజలు ,మెంతులు ,కొబ్బరి నూనె, ఆముదం.
తయారీ విధానం :
ముందుగా కలోంజి గింజలును మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ గా చేసుకోవాలి. ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని అదే మిక్సీ జార్ లో రెండు స్పూన్లు మెంతులు వేసి మెత్తగా పట్టుకోవాలి. తర్వాత కలోంజి గింజలు పౌడర్ రెండు స్పూన్లు మెంతుల పౌడర్ రెండు స్పూన్లు ఒక గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలి.ఒక ఒక గాజు సీసా తీసుకొని 200 గ్రాములు కొబ్బరి నూనె తీసుకొని దానిలో పొయ్యాలి. ఆముదం కూడా తీసుకొని అందులో వేసి కలపాలి ముందుగా కలిపి పెట్టుకున్న పౌడర్స్ ను నూనెలో వేసి బాగా కలుపుకుని సీసాకు మూత పెట్టుకొని ఏడు రోజులపాటు ఎండ తగిలేలా చూసుకోవాలి. ఏడు రోజుల తర్వాత మళ్లీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ నూనె ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. తర్వాత ఈ నూనెను రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకొని పడుకోవాలి. మరునాటి ఉదయం తలస్నానం చేయాలి.ఎక్కువ గడత గల షాంపులు మాత్రం వాడకూడదు ఇలా ఈ నూనె 15 రోజులు వాడడం వల్ల పలచగా ఉన్న జుట్టు ఒత్తుగా మారడంతో పాటు, జుట్టు రాలె సమస్య తగ్గుతుంది.