నిజామాబాద్ శాసన మండలి స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అందరూ ఊహించినట్లే టీఆర్ఎస్ అభ్యర్థిని కల్వకుంట్ల కవిత విజయం సాధించారు. మొత్తం 824 ఓట్లకు గానూ 823 ఓట్లు పోల్ అయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కవిత కి 728 ఓట్లు రాగా, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. బీజేపీ అభ్యర్థి లక్ష్మినారాయణకు 56, కాంగ్రెస్ అభ్యర్థి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కి 29 ఓట్లు వచ్చాయి. 10 ఓట్లు చెల్లుబాటు కాలేదు.