మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు సినీ నటుడు కమల్ హాసన్ రోజురోజుకీ రాజకీయాల్లో ఆరితేరిన పోతున్నారు. గత పార్లమెంటు ఎన్నికల సమయంలో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవని కమలహాసన్.. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల లో భారీగా సత్తా చాటాలని తమిళ ప్రజలలో సెంటిమెంట్ పుట్టించడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసి నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఇటీవల కన్యాకుమారి తిరునల్వేలి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న కమలహాసన్ ప్రసంగిస్తూ ఎంజీఆర్ కి తానే నిజమైన రాజకీయ వారసుడని అని పేర్కొన్నారు. ఎంజీఆర్ కలను సాకారం చేసే సత్తా ఉందని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో రజినీకాంత్ పార్టీ గురించి మాట్లాడుతూ ఇద్దరం మంచి స్నేహితులం అయినా రాజకీయాల్లో సిద్ధాంతాలు వేరు అయితే ఏమీ చేయలేమని ఒకే రకంగా ఉంటే మాత్రం కలిసి పనిచేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఒరేయ్ రాబోయే రోజుల్లో రజినీకాంత్ తన పార్టీ గురించి ఏం చెబుతారో వేచి చూడాలని పేర్కొన్నారు. ఇక తన పార్టీ టార్చిలైట్ గుర్తు కోసం ఎన్నికల కమిషన్ దగ్గర బాగా పోరాడుతున్నట్లు ఈ చిహ్నాన్ని వదులుకునే ప్రసక్తి లేదన్నట్లు తెలిపారు. ఏదిఏమైనా తమిళనాడు రాజకీయాల్లో మక్కల్ పార్టీ నేతృత్వంలో రాష్ట్రంలో మూడో కూటమి అన్నది సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని కమల్ అన్నారు.