Vikram : ‘విక్రమ్’ విశ్వ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ భారీ యాక్షన్ ఎంటరైనర్. ఈ సినిమాలో నలుగురు విలన్లు నటించనున్నారు. ‘విశ్వరూపం’కి సీక్వెల్గా వచ్చిన ‘విశ్వరూపం 2’ తర్వాత మళ్ళీ కమల్ హాసన్ నుంచి సినిమా రాలేదు.ఈ సినిమా 2018లో వచ్చింది. దాదాపు కమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేసి రెండేళ్ళు దాటేసింది. క్రియేటివ్ జీనియస్ శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ‘ఇండియన్ 2’ మొదలు పెట్టారు. ఈ సినిమా దాదాపు 60 శాతం చిత్రీకరణ జరిగాక క్రియేటివ్ డిఫ్రెన్సెస్ వచ్చి వివాదాల్లో చిక్కుకుంది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాంతో టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగారాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాను పట్టాలెక్కించాడు కమల్. ఇప్పటికే రిలీజ అయిన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీనితో ఈ సినిమాపై కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్తో రూపొందిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలే అధికంగా ఉంటాయని టీజర్ తో హింట్ ఇచ్చాడు దర్శకుడు. ఈ నేపథ్యంలో కమల్ కి విలన్స్ గా ఆయనని ఢీకొట్టడానికి నలుగురు ఉంటారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Vikram : కమల్ హాసన్ కెరిర్లో 232వ సినిమాగా ‘విక్రమ్’ రూపొందుతోంది.
ఈ క్రమంలో ఇప్పటికే మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ఒక రోల్ కి ఎంచుకున్నారు. కాగా తాజాగా మేకర్స్ మిగతా ముగ్గురు విలన్స్ ను ఎంపిక చేసే పనిలో ఉన్నారట. కోలీవుడ్ విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ని ఓకే చేశారట. సేతుపతి ఇప్పటికే లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ‘మాస్టర్’ సినిమాలో విజయ్ కి పోటీగా నెగెటివ్ పాత్రలో నటించాడు. ఇందులో ఆయనకి మంచి పేరు వచ్చింది. అలాగే కార్తి నటించిన ఖైదీ సినిమాలోని నరైన్ ని ఫైనల్ చేశారట. ఇక ఒక్కరిని ఎంపిక చేయాల్సి ఉందని సమాచారం. ఆ ఒక్క పాత్ర ఎవరికి దక్కుతుందో అని ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. కాగా ‘కేజీఎఫ్’కి యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన అన్బు-అరివ్.. ‘విక్రమ్’ సినిమాకి ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆయన కెరిర్లో 232వ సినిమాగా రూపొందుతోంది.