క్వీన్ కంగన రనౌత్ గురించి అందరికీ తెలిసిందే. ఎంత గొప్ప నతో అంతకంటే గొప్పగా కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ విషయంలో కొన్ని సార్లు వివాదాల దర్శకుడు రాం గోపాల్ వర్మ నే మించిపోతుంది. గతంలో తన పనేదో తను చేసుకుంటూ సాగిన కంగనా రాను రాను తనతో పని చేసిన దర్శక, రచయితలు.. నిర్మాతలతోనూ ప్రతీ విషయంలో గొడవలు పడేదన్న సంగతి తెలిసిందే.
ఈ కారణంగానే చాలామంది కంగనని దూరం పెడుతూ వస్తున్నారు. అంతేకాదు.. హృతిక్ రోషన్ .. మహేష్ భట్ .. కరణ్ జోహార్ తో పాటు బాలీవుడ్ లో ఉన్న కొందరు ప్రముఖులపైన ఎప్పుడు రగిలిపోతూనే ఉంటుందికంగన. కొన్ని విషయాలలో కంగన ని గొప్పగా పొగడ్తలతో ముంచేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కొన్ని విషయాలలో మాత్రం కొరివితో తల గోక్కోవడం ఎందుకు అని సైలెంట్ గా సైడైపోయోవాళ్ళు అంతమంది ఉన్నారు.
ఇప్పుడు ఏకంగా తాను బాలీవుడ్ మాఫియా అంటూ కొందరు స్టార్ హీరోల పేర్లను బయటపెట్టడం అలానే డ్రగ్స్ లో వీళ్లంతా ఉన్నారని వాదించడంతో హాట్ టాపిక్ గా మారింది కంగన. కంగన దెబ్బకి బయపడి చాలామంది మేకర్స్ ఇప్పటికే ఆఫర్లు ఇవ్వకపోవడంతో తనే నిర్మాతగా మారి సొంత సినిమాలు తీసుకుంటుంది.
ఇక తాజా సమాచారం ప్రకారం కంగనను ఓ క్రేజీ ప్రాజెక్టు నుంచి తొలగించడం పలు ఆసక్తికరమైన చర్చలకు తెర లేపాయి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కం దర్శకుడు పీసీ శ్రీరామ్ రీసెంట్ గా కంగన ప్రధాన పాత్రలో నటించే ఓ సినిమాకి కమిటయ్యాడు. కానీ ఉన్నపలంగా ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అని ప్రకటించారు. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ గురించి అందరికీ తెలిసిందే. మొత్తం కెరీర్ లో చిన్న కాంట్రవర్సీ కూడా లేని వ్యక్తిగా ఇండస్ట్రీ మొత్తం చెప్పుకుంటారు.
అలాంటి లెజెండరీ సినిమాటోగ్రాఫర్.. వివాదాల క్వీన్ తో పని చేయడం కష్టమని భావించే ఇలా చేశారా? అన్న టాక్ వినిపిస్తుంది. కంగనతో సినిమా చేయడం తనకు కాస్త అసౌకర్యంగా అనిపించి ఈ సినిమా వద్దనుకున్నాను అని వెల్లడించారు.