గత ఏడాది లాక్ డౌన్ సమయంలో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణించిన సంగతి తెలిసిందే. ముంబైలో తన ఫ్లాట్లో ఉరి వేసుకుని చనిపోవటం అప్పుడు దేశ వ్యాప్తంగా చాలా మందిని విస్మయానికి గురి చేసింది. ప్రధాని మోడీ తో పాటు చాలా మంది సెలబ్రెటీలు సుశాంత్ మరణవార్త పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇటువంటి తరుణంలో జనవరి 21వ తారీకు సుశాంత్ బర్త్ డే సందర్భంగా.. అతని తలచుకుని చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు అదేవిధంగా సుశాంత్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. ఇలాంటి తరుణంలో సుశాంత్ మరణించిన సమయంలో.. బాలీవుడ్ ఇండస్ట్రీ ని టార్గెట్ చేసి భారీ స్థాయిలో విమర్శలు చేసిన స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తాజాగా కూడా స్పందించడం జరిగింది. సుశాంత్ 35వ బర్త్ డే సందర్భంగా.. ట్విట్టర్ లో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పెద్దలను టార్గెట్ చేసుకుని వరుస ట్వీట్లు చేయడం జరిగింది.
సుశాంత్ మరణానికి కారణం ఆదిత్య చోప్రా, బాలీవుడ్ బిగ్ నిర్మాత కరణ్ జోహార్ అదేవిధంగా మహేష్ బాట్ పై ఊహించని కామెంట్లు చేయడం జరిగింది. అందరి గురించి రాస్తూ ఇలాంటి వాళ్లు ఇండస్ట్రీలో ఉండబట్టే నేపాటిజం వల్ల సుశాంత్ మరణించినట్లు.. కంగనా రనౌత్ మరోసారి స్పష్టం చేసింది.