అమరావతి: విశాఖ భూకుంభకోణంలో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోరారు, ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గత ప్రభుత్వ హయాంలోనూ కన్నా విశాఖ భూకుంభకోణంపై లేఖ రాశారు. టిడిపి ప్రభుత్వం ఈ భూకుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను నియమించిందని గుర్తు చేశారు. అయితే ఈ నివేదికను మాత్రం ప్రభుత్వం బయటపెట్టలేదనీ, దాన్ని బయటపెట్టాలని కన్నా డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని కన్నా కోరారు.
previous post
next post