(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆరోగ్యం కుదుటపడటంతో నేడు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు గుండె పోటు రావడంతో మూడు రోజుల క్రితం ఢిల్లీ ఓఖ్లాలోని ఫ్లోర్టిస్ ఎస్కార్ట్స్ ఆసుపత్రిలో చేరగా వైద్యులు వెంటనే హార్ట్ సర్జరీ చేశారు. మూడు రోజులుగా ఆసుపత్రిలోని ఐసియీలో చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో..వైద్యులు కపిల్ దేవ్ను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు.
కపిల్ దేవ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినట్లు మాజీ క్రికెటర్, ప్రస్తుత బీఎస్పీ నాయకుడు చేతన్ శర్మ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. డిశ్చార్జ్ సందర్భంలో ఆసుపత్రి వైద్యుడు అతుల్ మాథుర్తో కపిల్ దేవ్ దిగిన ఫోటోను చేతన్ శర్మ షేర్ చేశారు. దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ గుండె పోటుతో అస్వస్థతకు గురైయ్యారని తెలియడంతో ఆనేక మంది ఆందోళనకు గురి అయ్యారు. కపిల్ దేవ్ త్వరగా కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కావాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెట్టారు. 16 సంవత్సరాల పాటు జాతీయ క్రికెట్ జట్టుకు సేవలు అందించిన కపిల్ దేవ్..1983లో భారత్కు వన్డే ప్రపంచ కప్ అందించారు.
Dr Atul Mathur did Kapil paji angioplasty. He is fine and discharged. Pic of @therealkapildev on time of discharge from hospital. pic.twitter.com/NCV4bux6Ea
— Chetan Sharma (@chetans1987) October 25, 2020