ప్రపంచ శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె ఏ పాల్ గత సార్వత్రిక ఎన్నికలలో ఏపీ లో హడావిడి చేసిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీ నుండి పోటీచేసిన కె ఏ పాల్ చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగింది. కానీ ఆ టైమ్ లో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమెరికా తరహాలో అభివృద్ధి చేస్తాను అంటూ భారీ డైలాగులు వేయటం జరిగింది.
అంతమాత్రమే కాకుండా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయాలని.. చాలా ఎటకారం అయిన డైలాగులు పవన్ పై పాల్ వేయటం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక ఫలితాలు వచ్చేసరికి పాల్, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఓడిపోవటం అందరికీ తెలిసిందే. ఓటమి పాలు కావడంతో అమెరికా వెళ్లిపోయిన కే ఏ పాల్ అక్కడినుండి రాష్ట్రంలో జరుగుతున్న అనేక విషయాల గురించి అదేవిధంగా అప్పట్లో కరోనా వైరస్ గురించి తనదైన శైలిలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో వీడియోలు అప్లోడ్ చేస్తూ తన అభిప్రాయాలు చెప్పుకుంటూ వస్తున్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలలో విగ్రహాల ధ్వంసం అవ్వడం పట్ల పలు రాజకీయ పార్టీలు మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న తీరును ఖండిస్తున్నారు కె ఏ పాల్. ఇలాంటి తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కె ఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి.. నీకు సిగ్గు ఉందా..?, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కళ్లు తెరుస్తావు..? చారులో కరివేపాకుని వాడుకొని ఎలా వదిలేస్తారో.. తిరుపతి ఉప ఎన్నికల్లో బిజెపి వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టి నిను ఆల్రెడీ కరివేపాకు లాగా పక్కన పెట్టేశారు. ఇందాక ఒక పెద్ద కాపు నాయకుడు నాతో ఫోన్లో మాట్లాడాడు. నీ గురించి బాధ పడ్డాడు తమ్ముడు, వాళ్ల నుండి నువ్వు బయటకు వస్తే మనమంతా కలిసి అన్ని మతాలను కలుపుకుని రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామంటూ పవన్ కళ్యాణ్ కి పాల్ పిలుపునిచ్చారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?