Karnataka Assembly Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలు పోరుకు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కోసం తమ మొదటి అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది మే లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు గానూ 124 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది కాంగ్రెస్. రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమిటీ ఖరారు చేసిన కాంగ్రెస్ అభ్యర్ధుల మొదటి జాబితా ఇదే అంటూ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
తొలి జాబితాలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత సిద్ద రామయ్య, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పేర్లు ప్రకటించారు. కర్ణాటకలో ఎప్రిల్ మొదటి వారంలో అసెంబ్లీ ఎన్నికల నోటిపికేషన్ వెలువడే అవకాశం ఉండగా, మే లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో కర్ణాటకలో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని తీవ్రంగా కృషి చేస్తొంది. అధికార బీజేపీ అవినీతి, అధికార దుర్వినియోగాన్ని ఎండగడుతూ ప్రజల్లో బలాన్ని పెంచుకునే పనిలో కాంగ్రెస్ ఉంది.
మరో పక్క మరో సారి అధికారంలోకి వచ్చి తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ పార్టీ గెలుపునకు ఆ పార్టీ ప్లాన్ చేస్తొంది. జేడీఎస్ నేత, మాజీ సీఎం మంత్రి కుమార స్వామి కూడా రాష్ట్ర రాజకీయాల్లో మరో సారి చక్రం తిప్పడానికి సన్నద్దం అవుతున్నారు.
అమరావతి నిర్మాణాల్లో చంద్రబాబు ఇలా భారీ అవినీతికి పాల్పడ్డారంటూ వివరించిన సీఎం జగన్
Here is the first list of Congress candidates finalised by the CEC for the forthcoming Karnataka assembly elections. pic.twitter.com/MeySmYLPev
— Congress (@INCIndia) March 25, 2023
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?