Corona Aid: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. నిత్యం నాలుగు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. మృతుల సంఖ్య వేలల్లో ఉంటుంది. బాధితులు, మృతుల కుటుంబాలకు సాయం అందించాలంటే ప్రభుత్వాలకే సాధ్యం అయ్యే పరిస్థితి కాదు. గడచిన 24 గంటల్లో నాలుగు వేల మందికిపైగా కరోనాతో మృత్యువాత పడ్డారు. ఇన్ని వేల మంది మృతుల కుటుంబాలకు, లక్షలాది మంది బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం సాధ్యం కాదు.
కానీ ఓ నియోజకవర్గం అక్కడి ఒక ప్రజా ప్రతినిధి మాత్రం మృతుల కుటుంబాలకు లక్ష వంతున, బాధితులకు 50వేల వంతున సాయం అందిస్తూ అపరదాన కర్ణుడుగా నిలుస్తున్నారు. ఈ మాదిరిగా ఏ నియోజకవర్గంలోనూ అక్కడి ప్రజా ప్రతినిధులు కరోనా బాధితులకు లక్షలాది రూపాయలు సాయం అందిస్తున్న దాఖలాలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు ప్రభుత్వంతో సంబంధం లేకుండా వ్యక్తిగత సాయం అందించడం అభినందనీయం. అటువంటి నాయకుడి గురించి అందరూ తెలుసుకోవాల్సిందే.
కర్నాటక రాష్ట్రం యశ్వంతపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ నేత ఎస్టి సోమశేఖర్ యడ్యూరప్ప మంత్రివర్గంలో సహకార శాఖ మంత్రిగా ఉన్నారు. సోమశేఖర్ తన నియోజకవర్గ పరిధిలో ప్రతి వార్డు, పంచాయతీలలో కోవిడ్ తో మృతి చెందిన వారికి, చికిత్స పొందుతున్న వారికి వ్యక్తిగత సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా కేంగేరి వార్డు వినాయక దేవాలయం వద్ద అదిచుంచనగిరి పీఠాధిపతి నిర్మలానంద స్వామిజీ సమక్షంలో 27 మంది మృతుల కుటుంబాలకు లక్ష వంతున సాయం అందజేశారు. అదే విధంగా బీబీఎంపీ నుండి ఆసుపత్రిలో చేరిన వారికి రూ.25 వేలు, సొంతం గా ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన వారికి రూ.50 వేల నగదుతో పాటు నిత్యావసరాలు, మెడికల్ కిట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?