నేటి సమాజంలో కుల గజ్టి రోజు రోజూకూ విస్తృతంగా వ్యాపిస్తూనే ఉంది. కులాలు, మాతాలంటూ వాటికి ప్రాకులాడే జనాల చేస్తున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తినే తిండిలోనూ, ఒంట్లో పారే రక్తంలోనూ లేని కులం మనుషులను ముట్టుకుంటే అంటుకుంటుందా. సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా, గొప్ప గొప్ప అంశాలను శాస్త్రవేత్తలు మన ముందుకు తెస్తున్నా నేటి సమాజంలోని మనుషులు మాత్రం ఇంకా అనాగరికులుగానే బతుకున్నారు. ఇందుకు ఉదాహరణలు చాలా ఉన్నాయండోయ్. అవి ఏంటనేవి మీకు తెలియని విషయాలైతే కావు. కులాలు పెడుతున్న చిచ్చుల గురించి ప్రతి రోజూ మనం వార్తలోనూ, పేపర్లోనూ చూస్తూనే ఉన్నాం.
అందులో మరీ ముఖ్యంగా చెప్పకోవాల్సింది కులాంతర వివాహాల గురించి. ఈ కుల పిచ్చి ఎలా మారిందంటే తన సొంతవాల్లెవరైనా అనగారిన లేదా వేరే కులం వ్యక్తులను తాకితే చాలు వారిని సైతం నిలువునా నరికేసేంతగా దారుణంగా తయ్యారయ్యారు. ఇలా నరికేసిన ఘటనలెన్నో మన ముందున్నాయి. దేశం రోజు రోజుకూ అన్ని రంగాల్లో అభి వృద్ధి చెందుతున్నా కుల గజ్జి మాత్రం రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. మనుష్యులంతా సమానమనే మానవత్వం నూటికి ఏ ఒక్కరిలో ఉంటుందో కూడా స్పష్టంగా చెప్పలేము. ఈ కుల పిచ్చి మూలంగా మరీ ముఖ్యంగా నిమ్న కులాల వారు దీనికి బలవుతూనే ఉన్నారు. ఉన్న ఊర్లనుంచి గెంటేస్తూ, అవమానిస్తూ ఎన్నో రకాలుగా వారు దారుణాలకు గురైన ఘటనలెన్నో..
అయితే కుల గజ్జి అగడాలు మాత్రం ఏ మాత్రం నియంత్రణలో ఉండటం లేదు. కాగా రోజు రోజుకు అధికమవుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటి ఘటనే తాజాగా కర్ణాటకా రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. కర్ణాటకలోని హల్లారే గ్రామానికి చెందిన మల్లిఖార్జున అనే వ్యక్తి ఈ మధ్యే కరోనా వలన వచ్చిన నష్టం మూలంగా బతుకుదెరువు కోసం బార్బర్ వృత్తిని చేపట్టాడు. దాని ద్వారానే తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే తన షాపుకు SC,ST సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు హెయి కటింగ్ కోసం రాగా వారికి హెయిర్ కట్ చేశాడు. అయితే ఈ విషయాన్ని తెలుకున్న గ్రామ పెద్దలు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వాళ్లను ముట్టుకుని హెయిర్ కట్ చేసి, వాళ్లిచ్చిన డబ్బులు తీసుకుని నువ్వు బతుకుతారా? ఆతర్వాత మమ్మల్ని ముట్టుకుంటావా నువ్వు అంటూ అతనిపై విరుచుకు పడ్డారు.
దాంతో ఆగకుండా అతనిని మా ఆ ఊర్లో ఎవ్వరినీ తాకడానికి వీలు లేదంటూ అలాగే ఇకపై మా ఇల్లకు కూడా రావాల్సిన అవసరం లేదంటూ దూషించారు. దాంతోపాటుగా అతనికి రూ.50 వేల జరిమానా కూడా విదించారు. దాంతో మల్లిఖార్జున తీవ్ర మనస్తాపానికి, బాధకు గురయ్యాడు. కరోనా కష్టకాలంలో నేను 50 వేల రూపాయలు ఎట్లా చెల్లించాలంటూ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఇలా ఇంతకు ముందుకూడా బెదిరించారని బార్జర్ మల్లిఖార్జున ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బులు కట్టడానికి ఒప్పుకోకుండా ఊరి పెద్దలను ఎదిరించి మాట్లాడినందుకు గ్రామ పెద్దలు తన కొడుకుని గొడ్డు బాదినట్టు బాది రూ.7 వేలు లాక్కెల్లి పోయారని మల్లిఖార్జున తెలిపారు. వారి హింసను తనింక భరించలేనని అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ ఘటన విన్న ప్రజా సంఘాలు కుల వివక్షపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.