basavaraj bommai: కర్ణాటక నూతన సీఎంగా బసవరాజ్ బొమ్మై నియమితులైయ్యారు. ఈ మేరకు బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తొలుత కొత్త సీఎం ఎంపిక ప్రక్రియకై బీజెపీ ఎల్పీ సమావేశం జరిగింది. బీజేపీ కేంద్ర నాయకత్వం పరిశీలకులుగా కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డిలు పాల్గొని ముఖ్యనేతలతో చర్చించి నూతన సీఎంను ఎంపిక చేశారు.
బీజేపీ కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు యడియూరప్ప నిన్న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. యడియూరప్ప రాజీనామాతో నూతన సీఎం ఎంపికకు మధ్యాహ్నం నుండి బెంగళూరులో కేంద్ర పరిశీలకులు సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. చివరకు బసవరాజ్ బొమ్మైని ఎంపిక చేశారు.