Karthika Deepam Jan 8 episode: కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ కొనసాగుతుందిన్. పాపం దీప పరిస్థితి తలుచుకుంటే మరి బాధగా అనిపిస్తుంది. రుద్రాణి అప్పు తీర్చడం కోసం మోనిత బాబును వీపుకు కట్టుకుని రైడ్లమీద తిరుగుతూ జంతికలు అమ్మడం చూసి అందరి మనసు భారంతో నిండిపోయింది. ఇక ఈరోజు ఎపిసోడ్ హై లైట్స్ చూస్తే బస్తీలో ఉంటున్న మోనిత ఇంటి ముందు వారణాసి ఆటో ఆగుతుంది.అందులోంచి విన్నీ అనే నర్స్ కాలు బయట పెడుతుంది రావడం రావడం మోనితకి ‘హాయ్ మేడమ్’ అని చెప్పి దగ్గరకు వెళ్తుంది. అది చూసిన వారణాసి..ఓహో ఈవిడ వచ్చింది మోనిత ఇంటికా అనుకుంటూ చూస్తాడు.
Karthika Deepam Jan 8 episode: మోనితను పిచ్చి పిచ్చిగా తిట్టినా వారణాసి :
మోనిత అప్పుడే ‘వారణాసి నా ఇంటికి ఎవరూ రారు అన్నావ్ కదా పని చేయడానికి ఇప్పుడు విన్నీ వచ్చింది ఈ విన్నీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? కేరళా నుంచి.. నరసమ్మలా పిరికిది కాదు,తనని పంపించడం నీ వల్ల కాదు..’ అంటుంది నవ్వుతూ.ఈలోపు విన్నీ అందుకుని ‘మేడమ్ నేను ఆటోలో వస్తున్నప్పుడు మీ గురించి అడిగితే మిమ్మల్ని రాక్షసి అని ఏదేదే తిట్టాడు.ఎందుకు అతనికి మీరంటే అంతా కోపం అని అడుగుతుంది విన్నీ..ముందు ముందు నీకే తెలుస్తుంది.అనినిజమే వారణాసి.. నీకు నేనంటే ఎందుకంత కోపం? నేను డాక్టర్ బాబు భార్యనే.. నేను మీ దీపక్క లాంటిదాన్నే నన్ను కూడా అక్కా అని పిలిచుకో అంటుంది మోనిత నవ్వుతూ.. ‘నువ్వు ఎప్పటికీ మా దీపక్క కాలేవు’అని అక్కడ నుంచి కోపంతో వెళ్లిపోతాడు వారణాసి
devotion : ముడుపులు ,మొక్కుబడులు నిర్లక్ష్యం చేస్తున్నారా ?
దీప అవేశాన్ని చూసి వెనక్కి తగ్గిన రౌడీలు :
మరోవైపు దీప జంతికల డబ్బా పట్టుకుని రోడ్డు మీద నడిచి వస్తుంటే రుద్రాణి తన మనుషులతో ఎదురు పడుతుంది. ‘ఏంటి దీపా అని మీరు నా అప్పు తీర్చలేరు గాని మీ పిల్లల్లో ఒకరిని నాకు ఇచ్చేయ్’ అంటుంది. దాంతో దీప ఒక చేతిలోని బ్యాగ్ కింద పెట్టి ఆవేశంగా.. రుద్రాణి గారు అని అరుస్తూ కొట్టబోతుంటే అక్కడ ఉన్న ముగ్గురు రౌడీలు ఒక అడుగు ముందుకు వేసి, దీప ఆవేశాన్ని చూసి మళ్ళీ వెనుక అడుగు వేస్తారు. నేనుఅప్పు తీరుస్తాను అని గట్టిగా సమాధానం ఇచ్చి.. వెళ్లబోతుంటే.. ‘ఎలా తీరుస్తారు? దేవుడు వచ్చి తీరుస్తాడా? అంటుంది. అందుకు దీప నవ్వుతూ ‘దేవుడే వస్తాడో దేవతే వస్తుందో ఎవరు చెప్పగలరు?’ అంటూ వెళ్లిపోతుంది.
పాపం కార్తీక్ పిల్లల ఆకలి ఎలా తీర్చుతాడో.?
ఇక డాక్టర్ భారతి చెప్పినట్లే ఆనందరావు ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఓ ప్రకృతి ఆశ్రమానికి తీసుకుని వెళ్లబోతుంది సౌందర్య. అందుకు తగ్గ ఏర్పాట్లలో ఉంటాడు ఆదిత్య.మరోవైపు కార్తీక్ దీప పిల్లలకు తెచ్చిన క్యారేజ్ నెలపాలు అవ్వడంతో అయ్యో.పిల్లలు ఆకలి తీర్చలేకపోయాననే అని బాధపడతాడు. ఇంటికి వచ్చి బియ్యం, కూరగాయలు అన్నీ వెతుకుతాడు కానీ ఇంట్లో మాత్రం అవేవి ఉండవు.చేసేది లేక కార్తీక్ ఒక హోటల్కి వెళ్లి అక్కడ మీల్స్ రేట్ ఎంతో అడుగుతాడు.వాళ్ళు చెప్పిన రేటే విని కార్తీక్ అయోమయంలో పడతాడు.