Karthika Deepam Mar 11 Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ ఈరోజు ఊహించని మలుపులతో ఎంతో రసవత్తరంగా సాగింది అనే చెప్పాలి. కార్తీకదీపం సీరియల్ అంటేనే కార్తీక్, దీప. వీరి ఇద్దరిలో ఎవరు సీరియల్లో లేకపోయినాగాని ప్రేక్షకులు తట్టుకోలేరు. మరి అలాంటింది ఇద్దరు చనిపోయారని తెలిస్తే అభిమానులు తట్టుకోగలరా… అసలు ఈరోజు సీరియల్లో ఏమి జరిగిందో తెలుసుకుందామా..!! గత ఎపిసోడ్ లో సౌందర్య కు ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు కార్తీక్. మరోపక్క సౌర్య ఏమో నేను కూడా నాన్నమ్మకి ఫోన్ కలుస్తుందేమో చూస్తా అంటూ పక్కకు వెళ్తుంది.
Karthika Deepam : మందు తాగి రచ్చ రచ్చ చేసిన వంటలక్క… దీపలో మరో కోణాన్ని చూసి షాక్ లో కార్తీక్..!
Karthika Deepam Mar 11 Today Episode: హిమ మొండితనం తల్లి తండ్రుల ప్రాణం తీస్తుందా..?
ఇక ఈరోజు ఎపిసోడ్ లో హిమ మాత్రం దీపను కారు ఎక్కమని, కారు స్టార్ట్ చేస్తుంది. వద్దు హిమ అని దీప ఆపినాగని వినదు. అయితే కొంత దూరం వెళ్ళిన తరువాత ఆ కారును హిమకు హ్యాండిల్ చేయడం కుదరదు.కారులో ఉన్న దీప కార్తీక్ బాబు అంటూ అరుస్తుంది కారును చుసిన కార్తీక్ కారు వెంట పరిగెత్తుకుంటూ వెళ్లి కారులో ఎక్కుతాడు అయినాగాని కారుకు రాయి తగలడంతో ఆ కారు అదుపుతప్పి ఒక్కసారిగా అడవిలోని ఒక లోయలోకి బోల్తా కొడుతుంది. అంతేకాకుండా అక్కడికక్కడే బ్లాస్ట్ అవుతుంది. దాంతో కారులో ఉన్న ముగ్గురు మరణిస్తారు. అది చుసిన సౌర్య మాత్రం ఏడుస్తూ కళ్ళు తిరిగి స్పృహ తప్పి కింద పడిపోతుంది.
Kathika Deepam Soundarya: త్వరలో పోలీస్ ఆఫీసర్ గా మనముందుకు వస్తుందట ఫేమస్ అత్తమ్మ ??
కార్తీక్, దీప, హిమ ముగ్గురు ఇక లేరు :
ఇలా ఆక్సిడెంట్ లో వీరు ముగ్గురు చనిపోయిన విషయాన్ని లక్ష్మణ్ దంపతులు వార్తల ద్వారా తెలుసుకుని వెంటనే వాళ్లు మోనిత దగ్గరికి వెళ్లి విషయం చెబుతారు.డాక్టర్ బాబు చనిపోయాడని లక్ష్మణ్ చెప్పడంతో మోనిత ఒకేసారి షాక్ అవుతుంది.విషయం తెలిసి బస్తీవాసులు అందరు సౌందర్య ఇంటికి వెళ్లి ఇక మాకు దిక్కేవరమ్మ అంటూ ఏడుస్తూ ఉంటారు. కళ్ళు తిరిగి పడిపోయిన సౌర్యను ఇంటికి తీసుకొని వస్తారు సౌందర్య దంపతులు.జరిగిన గోరాన్ని పంతులు గారికి చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటారు.
Karthika Deepam Mar 5 Today Episode: మోనిత ఎవరికీ మొక్షాన్ని ఇస్తుందో… ప్రమాదపు అంచుల్లో కార్తీక్ కుటుంబం ఉంది అని హెచ్చరించిన పూజారి..!
కార్తీక్ చనిపోయాడని తెలిసి షాక్ లో ఉన్న మోనిత :
సీన్ కట్ చేస్తే కార్తీక్ దంపతులకు, హిమ ఫోటోకు దండవేసి, బొట్టు పెట్టి అందరూ కూడా బాధను వ్యక్తం చేస్తూ ఉంటారు. విషయం తెలిసి కార్తీక్ వాళ్ళ అక్క వచ్చి నీ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయింది ఏంట్రా అంటూ ఫోటోను చూస్తూ గుండెలు అవిసేలా ఏడుస్తుంది.ఇక మోనిత విధవరాలిగా తెల్ల చీర కట్టుకొని సీన్ లోకి ఎంటర్ అవుతుంది. సౌందర్య వాళ్ళ ఇంటికి వచ్చి నా కార్తీక్ చనిపోవడానికి కారణం సౌందర్య కుటుంబమే అంటూ వాళ్ళని నిందిస్తూ ఏడుస్తుంది.
హిమ రీ ఎంట్రీ…ఎలా బతికింది..?
అందరు షాక్ అయ్యే విషయం ఏంటంటే చనిపోయిందనుకున్న హిమ తిరిగి ఇంటికి వస్తుంది.హిమ సౌందర్య ఇంటికి వస్తుంది.హిమను. చూసి రాగా సౌర్య కోపంగా హిమ ఫోటోను నేలపై గట్టిగా ఎత్తేసి అమ్మా నాన్నలను మింగేసిన రాక్షసి ఇదే అంటూ ఏడుస్తుంది. సౌర్య మాటలు విన్న హిమ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. హిమను సౌందర్య వాళ్ళు ఎవరు చూడలేదా.. చూసారా అనే విషయం తరువాయి భాగంలో చూద్దాం.. ప్రేక్షకులు కూడా కధ ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.