Karthika deepam Dec 21:గత ఎపిసోడ్ ని ఓ సారి నెమరు వేసుకుందాం.. రుద్రాణి ఇంటి దగ్గర జరిగిన విషయాన్ని కార్తీక్ దీపకు డీటెయిల్ గా చెప్పడు. కానీ అక్కడ జరిగే సంఘంటన మాత్రం కార్తీక్ కనుల ముందు మెదులుతూ ఉంటుంది. ఇంకా ఆ షాక్ లో నుండి కార్తీక్ తేరుకునే లోగా తన ఇద్దరు పిల్లలు కనిపించకుండా పోతారు. దాంతో కార్తీక్ టెన్షన్ నషాళానికి అంటుకుంటుంది. రుద్రాణి మీద అనుమానం వస్తుంది.. అక్కడితో నిన్నటి ఎపిసోడ్ కి ఎండ్ టైటిల్ కార్డు పడుతుంది. ఇక ఈరోజుటి భాగం మనం చూసుకుంటే..
Karthika Deepam Dec 20: రుద్రాణి లిటికేషన్ కు కార్తీక్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి!
పిల్లలు దొరుకుతారా?
కార్తీక్, దీప ఇద్దరూ కలిసి పిల్లల కోసం ఇల్లు మొత్తం గాలిస్తారు. ఓ వైపు కార్తీక్ కు రుద్రాణి అన్న మాటలు గుర్తుకు వస్తాయి. ఇంతలోగా ఆ పిల్లలు ఓ మూలన బాధపడుతూ మౌనంగా కూర్చుని వుంటారు. దాంతో కార్తీక్, దీప హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. ఇద్దరూ కంగారుగా వారిద్దరు దగ్గరికి వెళ్లి.. ‘ఏమైందమ్మా?’ అని అడగడంతో పిల్లలు ఇద్దరూ కలిసి ‘కొంతమంది స్కూల్ ఫ్రెండ్స్ మమ్మల్ని హేళన చేసారు. మనకి ఏమీ లేదంట. మా బేగులో ఏమీ వుండదంట!’ అని అంటూ.. మళ్ళీ ‘మాతో ఎవరూ మాట్లాడటం లేదు!’ అని చెప్తారు. ప్రస్తుత పిల్లల దుస్థితికి కారణమైన కార్తీక్ దీపలు బాధపడతారు. వారిని ఓదార్చుతారు.
Karthika Deepam Dec 18: రుద్రాణి ఇంటికి కార్తీక్ వెళ్లడమేంటి! ఏం జరుగుతోంది?
డబ్బులుకోసం సేటు దగ్గరకు వెళ్లిన దీప పరిస్థితి ఏమిటి?
డబ్బులకోసం వేరేదారి లేక సమీపంలో వున్న సేటు దగ్గరికి వెళ్తుంది దీప. ఆ సేటుకి దీప తన వివరాలు చెప్పగానే, తనకి డబ్బు ఇవ్వడం కుదరదని సేటు చెప్పడం జరుగుతుంది. విషయం అర్ధమైన దీప సేటుతో రుద్రానికి ఓ సారి ఫోన్ చేసి ఇవ్వమని అడుగుతుంది. వెంటనే సేటు రుద్రానికి ఫోన్ చేసి దీపకు ఇస్తాడు. రుద్రాణితో దీప “నేను బాధపడటమే మీకు కావాలి కదా, మీ కోరిక నెరవేరింది. వేరే గత్యంతరం లేకే సేటు దగ్గరికి నా పుస్తుల తాడుని తాకట్టు పెట్టడానికి వచ్చాను!” అనగానే రుద్రాణి సేటుకి ఫోన్ ఇవ్వమని, సేటుకి డబ్బు ఇవ్వమని చెప్తుంది… కట్-