Karthika Deepam Today Episode: మంచి కుటుంబ కదా నేపథ్యంలో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. గత ఎపిసోడ్ లో ప్రేమ్ ఫోటో ఎగ్జిబిషన్ కు ప్రేమ్ అమ్మా నాన్నలు ఇద్దరు రావడంతో కధనం మరింత ఉత్కంఠంగా మారింది. మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందామా..జ్వాలతో సహా ఫ్యామిలీ మొత్తం జోకులు వేసుకుంటూ ఎవరు ఊహల్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే స్వప్న మాత్రం వాళ్ళను చూసి మనసులోనే రగిలిపోతు ఉంటుంది.
Karthika Deepam Today Episode: ప్రేమ్ విజయం వెనుక ఉంది ఎవరంటే..?
అయితే ప్రేమ్ ఫోటో ఎగ్జిబిషన్ కు స్పెషల్ గెస్ట్ గా విచ్చేసిన ఆవిడా ప్రేమ్ డిజైన్ చేసిన ఒక ఫోటోను మూడు లక్షల రూపాయలకు కొనుగోలు చేసి చెక్ ఇస్తుంది. అంత అమౌంట్ పెట్టి కొనుగోలు చేయడంతో ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతారు. ఇక జ్వాల అయితే ఆ ఆఫొటోలో ఏముంది అని అంత పెట్టి కొన్నారు అని అనుకుంటుంది. కాగా ప్రేమ్ మాత్రం నా విజయం వెనుక ఉన్నది మా నాన్న. ఆయన నన్ను ఎంతగానో సపోర్ట్ చేయవడం వలన ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్తాడు.దాంతో స్వప్న మరింత రగిలిపోతుంది.
జ్వాల చేసిన పనికి స్వప్నకు కోపం మాములుగా రాలేదుగా..?
ఆ తర్వాత వచ్చిన గెస్ట్ తో ఫోటో దిగుదాం అని ప్రేమ్ అంటే మధ్యలో జ్వాల వచ్చి అందరం ఇక్కడే ఉన్నాము కదా ఫ్యామిలీ ఫోటో దిగుదాం అంటుంది.అంత కలిసి ఒక ఫోటో దిగుతారు. ఈ క్రమంలో జ్వాల స్వప్న ను సత్య పక్కన ఉంచుతుంది.ప్రేమ్ ను హిమను పక్కన నుంచో పెడుతుంది. ఇక నిరూపమ్ జ్వాల నువ్వు కూడా వచ్చి ఫోటో దిగు అనడంతో వెంటనే వచ్చి నిరూపమ్ పక్కన నిలబడుతుంది.
తన వాళ్ళ కోసం ఆనంద్ పడుతున్న మనోవేదన :
సీన్ కట్ చేస్తే మోనిత కొడుకు ఆనంద్ హోటల్ దగ్గర చదువుకుంటూ నాకెవరూ బంధువులు లేరా.. తోబోట్టువులు లేరా అని మనసులోనే బాధపడుతూ ఉంటాడు.మరో వైపు జ్వాల, ప్రేమ్ లు గిఫ్ట్ విషయంలో గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళను చూసి స్వప్న ఇంకా మనసులో కోపం పెంచుకుంటుంది.ఇక ప్రేమ్ ఆ గిఫ్ట్ లో హిమ ఫోటో ఉందని అందరికీ తెలిసిపోతుందని భయపడుతూ ఉంటాడు. ఆ తరువాత నిరూపమ్ వచ్చి జ్వాలను పక్కకు తీసుకుని వచ్చి ఏంటి ఈ ఆటలు అంటాడు. నేనేమన్నాను డాక్టర్ సాబ్.. నాకు గిఫ్ట్ ఇవ్వు అన్నా అంటుంది. మీరు అలా పొట్లాడుకోవడం మాకు తెలుసు మమ్మీకి తెలియదు కదా అంటాడు.
జ్వాల కోసం అమ్మను ఎదిరించిన నిరూపమ్ :
ఈ క్రమంలోనే జ్వాలకు ఫ్యామిలీ ఫోటో దిగేలా చేసినందుకు థాంక్స్ చెబుతాడు. ఇక దాంతో స్వప్న ఎలాగైనా తన కొడుకులకు జ్వాలను దూరం పెట్టాలనే ఆలోచనలో ఉంటుంది. ఇక సత్య నువ్వు బలవంతంగా నన్ను తీసుకొని వచ్చి మంచి పని చేసావు అని జ్వాలతో అంటాడు.ఆ క్రమంలో స్వప్న వాళ్ళ దగ్గరకు వచ్చి ఎవరో అనామకురాలు వండి పెడితే తింటున్నారు అని అంటుంది. దాంతో జ్వాల మీరు సక్రమంగా వండి పెడితే వాళ్ళకి ఈ కర్మ ఉండదు కదా అని అంటుంది. ఆ మాటకి స్వప్న జ్వాల మీద కోపంతో ఏమి కుసావే అంటూ చెంపమీద కొట్టబోతుంది. ఈలోపు నిరూపమ్ వచ్చి స్వప్న చేయి పట్టుకుని కొట్టకుండా ఆపుతాడు.. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.